ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసును ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో, విజయవాడ సీపీ, సిట్ అధిపతి రాజశేఖర్ బాబుకు ఈడీ లేఖ రాసి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని కోరింది.సిట్ ఇప్పటికే కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసింది. రాజ్ కసిరెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ నుంచి వచ్చిన సమయంలో అరెస్ట్ చేయబడినట్లు సమాచారం.

అతను మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు. అయితే, ఆయనను అరెస్ట్ చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో సిట్ అధికారులు 21/2024 ఎఫ్ఐఆర్ వివరాలు, సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలు, అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు, ఛార్జీఫీట్స్ కాపీలను ఈడీకి అందజేయాలని కోరారు. ఈడీ ఈ సమాచారాన్ని తన దర్యాప్తులో ఉపయోగించనుంది.లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్ను కూడా అరెస్ట్ చేసి, కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే, మరికొన్ని అరెస్ట్లు కూడా జరిగాయి. నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ మధ్యంతర రక్షణ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినప్పటికీ, వారికి నిరాశే ఎదురైంది.
Read Also : Rain: ఏపీలో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు