AP Inter Results : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం (ఏప్రిల్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఫలితాలను https://www.eenadu.net , https://resultsbie.ap.gov.in వెబ్సైట్లతోపాటు మన మిత్ర వాట్సప్ యాప్లోనూ పొందవచ్చు. వాట్సప్ నంబరు 95523 00009కు ‘హాయ్’ అని ఎస్ఎంఎస్ ఇచ్చి, ఫలితాలను ఎంచుకొని, అవసరమైన సమాచారాన్ని అందిస్తే పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వస్తాయి. వీటిని షార్ట్ మెమోగానూ వాడుకోవచ్చు. ఇంటర్ ఫలితాలను హడావిడి లేకుండా విడుదల చేయాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారు. ఈసారి ఫలితాల వెల్లడి కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు, అందుకు కొంత మొత్తం ఖర్చు చేయడం, రాజకీయ హడావిడి వంటివి లేకుండా నిర్వహించనున్నారు. గతంలో ప్రత్యేకంగా విలేకర్ల సమావేశాలు నిర్వహించడం వల్ల కొన్నిసార్లు ఫలితాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్నారు.
Read Also: చేబ్రోలుకు 14 రోజుల రిమాండ్