కూటమి సర్కార్ నుండి కొత్తగా నియమితులైన మహిళా ఉద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్లో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. కూటమి సర్కార్ మాతృత్వ హక్కులకు గౌరవం ఇస్తూ, ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే ప్రసూతి సెలవుల ప్రయోజనం వర్తించేది. అయితే ఇప్పుడు కొత్తగా నియమితులైన మహిళా ఉద్యోగులు కూడా ప్రసూతి సెలవులు తీసుకున్నా, వారి ప్రొబేషన్పైన ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ను విడుదల చేసింది. దీనివల్ల సుమారు వేలాది మంది మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రబలంగా నిలిచిన మహిళా హక్కుల పోరాటం
ఇది చిన్న విషయం కాదు. ఉద్యోగంలోకి కొత్తగా వచ్చిన మహిళలు ప్రసూతి సెలవులు తీసుకోవాలంటే రెండు సార్లు ఆలోచించేవారు. ఎందుకంటే, సెలవులు తీసుకుంటే ప్రొబేషన్ కాలం పొడిగించబడతుందేమో అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేసిన ఈ సానుకూల నిర్ణయం మహిళా ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేస్తోంది. ఇది ఒకరకంగా మహిళా ఉద్యోగుల హక్కుల పోరాటానికి గెలుపు లాంటి అంశం. గతంలో ఎన్ని వినతులు చేసినా, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందించని ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు తక్షణమే స్పందించడం, మహిళా ఉద్యోగుల జీవితాల్లో ఆశావహ మార్పులకు నాంది పలికింది.
గెజిట్ ద్వారా అధికారిక ధ్రువీకరణ
ఈ నిర్ణయం ఎలాంటి అనుమానాలకు తావులేకుండా గెజిట్ ద్వారా అధికారికంగా ప్రకటించబడినట్లు సమాచారం. ఇకపై కొత్తగా నియమితులైన ఉద్యోగినులు తల్లిగా మారే సమయాన్ని ఆందోళనలతో కాకుండా ఆనందంగా గడిపే అవకాశం లభించనుంది. మాతృత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం సర్కార్ మంచి సంకేతం. ఇది రాష్ట్రంలోని మహిళా ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది.
ఉద్యోగినుల ఆనందానికి మితులేదు
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అనేకమంది మహిళా ఉద్యోగులు సోషల్మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. “ఇది మా కోసం తీసుకున్న గొప్ప నిర్ణయం, ఇప్పుడు కుటుంబం, ఉద్యోగం రెండింటినీ సమతుల్యంగా నడిపే అవకాశం ఏర్పడింది” అని అంటున్నారు. ఇటీవలె ఉద్యోగంలో చేరిన అనేకమంది మహిళలు తల్లి కావడం వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలలో ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ వల్ల వారు సంతోషంగా తల్లి కావచ్చు, భవిష్యత్తుపై భయాలు లేకుండా ముందుకెళ్లొచ్చు.
READ ALSO: Pavan Kalyan : 345 మందికి పాదరక్షలు పంపిన పవన్ కళ్యాణ్