Andhra Pradesh: అవకతవకలకు పాల్పడిన 140 మంది వైద్య సిబ్బందిని తొలగించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh: అవకతవకలకు పాల్పడిన 140 మంది వైద్య సిబ్బందిని తొలగించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.వైద్యులు, సిబ్బందిని విధుల నుంచి తప్పించేయాలని ఆదేశించింది. దాదాపు 140 మంది వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడ్డారని,వారందరికి ఉద్యోగుల నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పీహెచ్‌సీలు, ఇతర ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ముఖఆధారిత హాజరు నమోదు)లో అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ‘పట్టణాల్లో నివసించే వైద్యులు, ఇతర సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోవడం లేదు,అయినా నిర్ణీత సమయంలోనే విధులకు వచ్చినట్లు సమయ వేళలను ఐ-ఫోన్‌ సాంకేతికతతో మార్చారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు’ ఈ కారణంతోనే వారందరిని తప్పించాలని ఆదేశించారు.మరోవైపు భారత్‌ పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి తర్వాత,కేంద్రం సూచనల మేరకు అత్యవసర సమయంలో వైద్య సేవలపరంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది.అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది. డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆధ్వర్యంలో నడిచే జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సహా ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు డీసీహెచ్‌ సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ‘అత్యవసర సమయంలో ఎలా వైద్యాన్ని అందించాలన్న దానిపై ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించాలి. ఆక్సిజన్‌ సదుపాయాన్ని మెరుగుపరచాలి. జనరేటర్లను సిద్ధంగా ఉంచాలి. అవసరమైతే వాలంటీర్ల సాయం కోరేందుకు వీలుగా జాబితాలు సిద్ధంచేయాలి’ అని వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల అధికారులను సిరి ఆదేశించారు.

Advertisements
 Andhra Pradesh: అవకతవకలకు పాల్పడిన 140 మంది వైద్య సిబ్బందిని తొలగించిన ఏపీ ప్రభుత్వం

వైద్య మండలి

ఇటీవల ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్‌లో కూడా ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే వరుసగా ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగుల నియామకం విషయంలో అవకతవకలు జరిగాయనే కారణాలతో వీరిని తప్పించారు.ఆంధ్రప్రదేశ్ నూతన వైద్య మండలి ఛైర్మన్‌‌గా డాక్టర్ శ్రీహరిరావు విజయవాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వైద్య విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేసే విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని అమలుచేశారని, 2019 నుంచి నిలిపేశారన్నారు. ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌లో యూనివర్శిటీ, కాలేజీల స్థాయిలో ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను 2025-26 విద్యాసంవత్సరం నుంచి అందజేస్తామన్నారు.

Read Also :High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

Related Posts
పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ అమలు – నారా లోకేష్
పాఠశాలల్లో 'నో బ్యాగ్ డే' అమలు - నారా లోకేష్

పిల్లలు స్కూల్ బ్యాగులను తీసుకుని బడికి వెళ్లడం గురించి చర్చిస్తూ, వారికి ప్రతి శనివారం ఒక రోజు బ్రేక్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ Read more

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
AP Cabinet meeting on 4th December

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాలి. Read more

CM Chandrababu : నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu to Tirumala with family today

CM Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనకు ఇందులో భాగంగానే నేడు రాత్రి తిరుమల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. Read more

సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు
Mangalagiri Police Notices to YCP Leaders Sajjala Ramakrishna Reddy

అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల మెడ చుట్టూ బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన పోలీసులు తాజాగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×