ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించింది.రాష్ట్ర ప్రణాళికా శాఖ (Planning Department) తాజాగా 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.ఇది పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉండబోతోంది.కానీ అవకాశం మాత్రం నిజంగా విలువైనది.ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక పోస్టు కేటాయించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 175 పోస్టులు.ప్రభుత్వం చేపట్టిన విజన్ యాక్షన్ ప్లాన్ మరియు P4 కార్యక్రమాల అమలుకు వీరు కీలకంగా వ్యవహరించనున్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే, అభ్యర్థి వద్ద తప్పనిసరిగా MBA లేదా ఇతర పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.ఎవరైనా విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆలోచనాత్మకత కలిగినవారు ఈ రోల్కి అర్హులే.ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000 నెలకు వేతనం చెల్లించనున్నారు.ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇది మంచి ఆఫర్ అని చెప్పవచ్చు.కాంట్రాక్టు అయినా సరే, జీతం విషయంలో మాత్రం అటు తిరుగు లేదు.ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే, అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదు.అలాగే దరఖాస్తుల చివరి తేదీ మే 13, 2025. కనుక ఆలస్యం చేయకుండా ఇప్పుడే అప్లై చేయడం ఉత్తమం.

ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఇందులో భాగంగా:
విద్యార్హతలు
రాత పరీక్ష
వ్యక్తిగత ఇంటర్వ్యూలు
ఈ మూడు దశలను అభ్యర్థులు దాటి వెళ్లాలి. ప్రతిభ ఉంటే తప్పకుండా ఎంపిక అవుతారు.ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే, ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిలో దరఖాస్తు లింక్, సిలబస్, ఎంపిక విధానం తదితర వివరాలన్నీ ఉన్నాయి. అధికారిక వెబ్సైట్: https://apsdpscareers.com/YP.aspx ఈ అవకాశం ఒక సారి వచ్చిన చాన్స్. ప్రభుత్వ రంగంలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగం, నెలకు రూ.60,000 వేతనం, ఉద్యోగ భద్రతతో పాటు అనుభవం కూడా… ఇంకా ఆలస్యం ఎందుకు?
Read Also : AP Ration: ఏపీలో రేషన్ కార్డు దారులకు మరోసారి నిరాశ ఎందుకంటే?