ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
అమరావతిః ఏపిలో పదో తరగతి అడ్వాన్స్డ్సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆయన మీడియాకు వెల్లడించారు. ,1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. బాలురు 60.83 శాతం , బాలికలు 68.76 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. సప్లిమెంటరీలోనూ బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/