AP Cabinet meeting today..discussion on these issues!

నేడు ఏపీ కేబినెట్ భేటీ..ఈ అంశాలపైనే చర్చ !

అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగనుంది. SIPB ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనున్నది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కూడా చర్చించనుంది. కాగా.. ఈ నెల 15 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండ‌లి స‌మావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చజెండా ఊపనుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా కొన్ని కీలకమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోనుంది.

image

జనవరి 30న రాష్ట్ర పెట్టుబ‌డుల పోత్సాహాక మండలి భేటీలో 15 ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా రూ.44,776 కోట్ల పెట్టుబ‌డులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్ట్‌ల‌కు మంత్రివ‌ర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరి జిల్లాలో రూ.14,328 కోట్లతో 2300 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో రూ.10,300 కోట్లతో మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయ‌నున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కూ కేబినెట్‌ గ్రీన్​సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్ట్‌లను ఆమోదించే అవ‌కాశం ఉంది.

ఇక అటు ఏపీలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదంటూ నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పటినుంచి జగన్ 2.0 ని చూస్తారని నిన్న వైఎస్ జగన్ కామెంట్స్‌ చేసిన సంగతి తెలసిందే. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తానని వివరించారు. అయితే.. జగన్ చేసిన కామెంట్స్‌ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అసలు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నించారు.ఎంతో మంది దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లను చంపాడని ఆరోపణలు చేశారు.

Related Posts
విజయసాయిరెడ్డిని విమర్శించిన వైఎస్ షర్మిల
విజయసాయిరెడ్డిని విమర్శించిన వైఎస్ షర్మిల

వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా చర్చకు దారితీసింది. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన Read more

FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2024:లిరెన్ మరియు గుకేశ్ మధ్య ఉత్కంఠ కరమైన పోటీ
fide

చైనా చెస్ ఛాంపియన్ లిరెన్, భారత దేశానికి చెందిన ప్రతిభావంతుడు గుకేశ్ మధ్య జరుగుతున్న FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 సింగపూర్ ,14-గేమ్ సిరీస్ సమ్మిట్ Read more

మహారాష్ట్ర ఎన్నికలు.. మోడీ, షాతో సహా 40 మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటించిన బీజేపీ
UP by elections. First list of BJP candidates released

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ తన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు Read more

Jagadish Reddy: కాంగ్రెస్ ని హెచ్చరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
Jagadish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాగ్వాదం చెలరేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను అప్రజాస్వామికంగా, ఏ Read more