ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఇది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించిన ప్రకారం, ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపు ఉదయం, అంటే ఏప్రిల్ 23, 2025న విడుదల చేయనున్నారు. ఇది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక, ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా 9552300009 అనే నంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. వాట్సాప్ను ఓపెన్ చేసి, ఆ నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపించండి. వెంటనే మీకు ఎంపికల మెసేజ్ వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత పదో తరగతి ఫలితాల లింక్ వస్తుంది. మీరు మీ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే, ఫలితాలు పీడీఎఫ్ రూపంలో అందిస్తారు.
Read also: Secretariat Staff : మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?