Another twist in the Adani

అదానీ కేసులో మరో ట్విస్ట్

భారత్-అమెరికా సంబంధాలకు ముప్పు

Advertisements

భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ (Adani Group) పై కొనసాగుతున్న లంచం కేసు కొత్త మలుపు తిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలకవర్గంలోని న్యాయ శాఖ (DoJ) తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా మారాయని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖ రాశారు. అదానీ గ్రూప్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై బైడెన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని వారు లేఖలో పేర్కొన్నారు. భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు అనేక ఏళ్లుగా బలంగా కొనసాగుతున్నాయి. కానీ ఈ కేసును అవసరమైన ఆధారాలు లేకుండానే ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ అనుబంధాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లు కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

దింతో అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ తీసుకున్న చర్యలు సముచితమా? అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ కేసును పక్కన పెట్టాల్సింది పోయి, మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసేలా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వల్ల అమెరికా వ్యాపార రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల అదానీ గ్రూప్‌పై ఎలాంటి చట్టబద్ధమైన సాక్ష్యాలు లేకుండానే కేసును ముందుకు తీసుకెళ్లారని అనేక మంది నిపుణులు అంటున్నారు. ఈ కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related Posts
California Sales Tax : కాలిఫోర్నియాలో పెరిగిన సేల్స్ ట్యాక్స్ భారం
California Sales Tax కాలిఫోర్నియాలో పెరిగిన సేల్స్ ట్యాక్స్ భారం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మళ్లీ పన్నుల అంశంతో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7.25 శాతం అమ్మకపు పన్ను అమలులో ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. Read more

Astronauts : వ్యోమగాముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
Astronauts

అంతరిక్షంలో వ్యోమగాములు అనారోగ్యానికి గురైతే, వారికి తగిన చికిత్స అందించేందుకు టీమ్‌లో ప్రత్యేకంగా ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఈ మెడికల్ ఆఫీసర్‌కు ప్రాథమిక చికిత్స, ఇంజెక్షన్లు Read more

Sridhar Babu: రైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తాం : శ్రీధర్‌ బాబు
We will turn farmers into businessmen.. Sridhar Babu

Sridhar Babu : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం(జీఐబీఎఫ్) ఆధ్వర్యంలో పార్క్‌ హయత్‌లో నిర్వహించిన ఇండియా - లాటిన్ Read more

రేపు ఢిల్లీలో శంకుస్థాపన చేయనున్న మోడీ
రేపు ఢిల్లీలో శంకుస్థాపన చేయనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 5న, ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఢిల్లీలో 12,200 కోట్లను మించి విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. Read more

×