వైసీపీ కి మరో షాక్..MLC పోతుల సునీత రాజీనామా

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు ఎలాగైతే నేతలు వరుస పెట్టి రాజీనామా చేసారో..ఇప్పుడు కూడా వరుసపెట్టి జగన్ కు షాక్ ఇస్తూ టిడిపి లో చేరుతున్నారు. తాజాగా MLC పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు MLC పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె తెలిపారు.

ఇదిలా ఉంటె వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రేపు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొంత కాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఆయన.. పార్టీ మారేందుకు మంత్రి అనగానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోగా ఈ అంశంపై అధికారిక ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి.