Another petition of Ram Gopal Varma in AP High Court

ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్ !

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ వేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు.

ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్ వేయడం జరిగింది. ఇక నేడు రామ్‌గోపాల్‌ వర్మ వేసిన పిటిషన్‌పై విచారించనున్న ఏపీ హైకోర్టు… ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. అటు జైల్లో వేసినా కూడా తాను భయపడను అంటూ వర్మ కామెంట్స్ చేశారు.

కాగా, రామ్‌గోపాల్‌వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తనకు ఎలాంటి భయం లేదని చెబుతూ.. తనపై ఫిర్యాదు చేసిన వారికి ఏమాత్రం అర్హత లేదని ఆయన అందులో స్పష్టం చేశారు. పోలీసు విచారణకు సహకరిస్తానని చెప్పి.. తప్పించుకుని తిరుగుతున్న ఆయన వీడియోలో వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో రెండుసార్లు ఆయన విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే.

Related Posts
4 గ్రహాలను గుర్తించే అరుదైన అవకాశం!
4 గ్రహాలను గుర్తించే అరుదైన అవకాశం!

ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఎస్ఐ) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. శ్రీ రఘునాథన్ కుమార్ సలహా ఇస్తూ, "6 నుండి 7 గ్రహాల దృశ్యమానత గురించి కొన్ని Read more

ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం – డిప్యూటీ సీఎం భట్టి
gaddar awards

ఉగాది పండుగ సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో మాట్లాడిన భట్టి, Read more

బంగ్లాదేశ్‌లో హిందూ పూజారి అరెస్టు:హిందూ మతవర్గంపై భయాలు
hindu

భారతదేశం బంగ్లాదేశ్‌ కు తీవ్రమైన ఆందోళన ను వ్యక్తం చేసింది. అది చటోగ్రామ్ లో ఒక హిందూ పూజారిని అరెస్టు చేసిన ఘటనపై, ఇక్కడి ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను Read more

సంక్రాంతి కానుకగా ప్రత్యేక రైళ్లు!
సంక్రాంతి కానుకగా ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే 52 ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, చెర్లపల్లి స్టేషన్ల నుండి కాకినాడ, నరసాపూర్, తిరుపతి, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *