కేటీఆర్కు మరోసారి అరుదైన గౌరవం
హైదరాబాద్: బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి అరుదైన గౌరవం దకింది. రష్యాలోని మాసోలో తాము నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో ప్రసంగించాలని ఆయనకు స్కోల్కోవో సంస్థ ఆహ్వానం పంపింది. ‘ఫ్యూచరిస్టిక్’ అనే అంశంపై భవిష్యత్తు అవకాశాలు, వినియోగించుకునే విధానాలపై ప్రసంగించాలని కేటీఆర్కు ప్రత్యేక ఆహ్వానం పంపడం విశేషం. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు ‘ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్యూచర్ పోర్టల్ 2030-2050’ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో కొత్త ఆవిషరణలను ప్రోత్సహించే విషయంలో కేటీఆర్ చేసిన కృషి అద్భుతమని ఆహ్వాన పత్రికలో స్కోల్కోవో ఫౌండేషన్ నిర్వాహకులు అభినందించారు. ‘మీకు ఉన్న అనుభవాన్ని మాతో పంచుకునేందుకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంచుకున్నాం. మీ రాక మాకు ఎంతో గౌరవం’ అని నిర్వాహకులు కేటీఆర్ను ప్రశంసించారు.
కార్యక్రమం ద్వారా 2030-2050 ప్రముఖ శాస్త్రవేత్తలు, భవిష్యత్తు శాస్త్రవేత్తలు, కళారంగానికి చెందిన పలు రంగాల ప్రముఖులను ఒక్కచోటుకు తీసుకొచ్చి భవిష్యత్తు తరానికి ఓ వేదికను అందించడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. సదస్సులో ఫ్యూచరాలజిస్టులు, ప్రపంచస్థాయి మేధావులు, శాస్త్రవేత్తలు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. భవిష్యత్తులో మరింత మెరుగైన అవకాశాలను సృష్టించడంపై చర్చిస్తారు. ఈ వేదిక టెక్నాలజీ, ఆర్థికరంగంలో ఉన్నత అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. స్టార్టప్ ప్రాజెక్ట్లను సిద్ధం చేసిన విద్యార్థులు, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు సరైన అవకాశాలు కల్పించేందుకు తోడ్పడుతుందని మాసో స్కోల్కోవో సంస్థ వెల్లడించింది.