మరో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు జవాన్లకు గాయాలు

Another encounter..Two jawans injured

జమ్ముః జమ్ముకాశ్మీర్‌లో ఈరోజు ఉదయం( గురువారం) మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. దోడా జిల్లాలోని అటవీ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అన్నారు. జడ్డాన్‌ బాటా గ్రామంలోని కస్టిఘర్‌ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిమిత్తం ఏర్పాటు చేసిన తాత్కాలిక సెక్యూరిటీ శిబిరంపై గురువారం తెల్లవారుజామున 2.00 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

దోడాజిల్లాలో గత మూడు రోజుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌ మూడవది. దోడాలోని డెస్సా ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. మంగళవారం గ్రామ రక్షణ బృందానికి చెందిన సభ్యులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. జమ్ము ప్రావిన్స్‌లో గత రెండు నెలల్లో ఉగ్రవాదుల కారణంగా 24 మంది మరణించారు. వీరిలో 10 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.