chandra babu

ఏపీలో మరో 20 వేల ఉద్యోగాలు-చంద్రబాబు!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన హామీల్లో ఉద్యోగాల కల్పన కూడా ఒకటి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కూటమి పార్టీలు.. ఇప్పుడు వాటిపై దృష్టిసారించాయి. ఇందులో భాగగా ఇవాళ జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యువతకు 20 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మూడవ రాష్ట్ర పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి కీలక పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ అక్షరాలా రూ.44,776 కోట్లు. ఈ మేర పెట్టుబడుల్ని ఆమోదిస్తూ ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పన జరగబోతోంది. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి సిఎం సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తి కరంగా ఉందని అభిప్రాయ పడ్డారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని వారికి తెలిపారు.

Related Posts
అట్టహాసంగా వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుక
CBN VNGS

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా గుంటూరులోని శ్రీ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అతిధిగా హాజరై, Read more

ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు
online certificate

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి సర్టిఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇది విద్యార్థులు, వారి Read more

తెలుగు తేజాలకు అర్జున పుర‌స్కారాలు
arjun awards

మన తెలుగు అమ్మాయిలకు రెండు అర్జున పుర‌స్కారాలు లభించాయి.కేంద్రం ప్ర‌క‌టించిన జాతీయ క్రీడా పుర‌స్కారాల్లో తెలుగు తేజాలు ఇద్ద‌రు ఎంపిక‌య్యారు. అథ్లెటిక్స్ విభాగంలో య‌ర్రాజి జ్యోతి, పారా Read more

పేర్ని నాని కుటుంబం పరారీలో ఉంది.. కొల్లు రవీంద్ర
Kollu Ravindra

వైసీపీ నేత పేర్ని నాని పరారీలో ఉన్నట్లు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయనపై కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నానిని వైసీపీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *