Anna Konidala visited the Lord

Anna Konidala : శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల

Anna Konidala : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల (అన్నా లెజినోవా) సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికగా.. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం నుండి అఖిలాండం వద్దకు చేరుకుని అన్నా కొణిదల టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు.

Advertisements
శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల

స్కూలు బిల్డింగ్ లో అగ్నిప్రమాదం

ఇటీవల సింగపూర్ సమ్మర్ క్యాంప్ వెకేషన్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదల దంపతుల కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. స్కూలు బిల్డింగ్ లో అగ్నిప్రమాదం సంభవించగా.. ఒకరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 20 మంది వరకు గాయపడ్డారు. వారిలో పదిహేను మంది వరకు చిన్నారులు ఉన్నారు. సింగపూర్ అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసి మార్క్ శంకర్‌‌తో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడింది. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో మార్క్ శంకర్ కు వైద్య చికిత్స అందించారు.

స్వామివారిని దర్శించుకున్న అన్నా కొణిదల

చిరంజీవి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు. తన కుమారుడికి చిన్న ప్రమాదం అనుకున్నాం, కానీ పెద్ద ప్రమాదమే జరిగిందని తరువాత తెలిసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్క్ శంకర్‌కు డాక్టర్లు బ్రాంకో స్కోపి నిర్వహించారని తెలిపారు. శ్వాసకోశ నాళాలు, ఊపిరితిత్తుల్లో పొగ చేరడంపై డాక్టర్లు ప్రత్యేక పరికరంతో పరీక్షలు చేశారు. దీర్ఘకాలంలో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని పవన్ అన్నారు. ఆదివారం నాడు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి ఏపీకి తిరిగొచ్చారు. కుమారుడు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడితే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని అన్నా కొణిదల మొక్కుకున్నారు.

Related Posts
అస్సాం సర్కార్ పై సుప్రీం కోర్టు అగ్రహం
గవర్నర్‌కు వీటో అధికారాల్లేవ్: సుప్రీంకోర్టు

ప్రభుత్వాల పనితీరులపై సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వాటి పనితీరులో మార్పులు వుండడం లేదు. దీనితో కోర్టుల ఆగ్రహానికి గురికావలిసి వస్తుంది. తాజాగా అస్సాం ప్రభుత్వ తీరుపై Read more

ఉత్త‌రాదిలో కూట‌మి నేత‌ల హ‌వా!
ఉత్త‌రాదిలో కూట‌మి నేత‌ల హ‌వా!

ఉత్త‌రాదిలో ఏపీ కూట‌మి నేత‌ల హ‌వా కొన‌సాగుతోంది. మొన్న మ‌హారాష్ట్ర‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేయ‌గా, అక్క‌డ బీజేపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. నిన్న ఢిల్లీలో Read more

Farooq: ఏపీ మంత్రి ఫరూక్ సతీమణి కన్నుమూత
ఏపీ మంత్రి ఫరూక్ సతీమణి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఇంట విషాదం ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన Read more

New Pamban Bridge: రేపు పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం చేయనున్న మోదీ
రేపు పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం చేయనున్న మోదీ

ఆలయం మొదలుకుని దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×