సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

CPS: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆర్థిక చర్యల ద్వారా, సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న మ్యాచింగ్ గ్రాంట్‌ను ఒక్కసారిగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో, నాలుగు లక్షలకు పైగా CPS ఉద్యోగులకు మేలు జరగనుంది.

Advertisements
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

సీపీఎస్ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా, సీపీఎస్ ఉద్యోగుల ఫ్రాన్ ఖాతాల్లోకి ₹2,300 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌ను ప్రభుత్వం జమ చేసింది. ఇది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 5 నెలల బకాయిలతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న 9 నెలల గ్రాంట్‌ను కూడా కలిపి చెల్లించింది. ఇప్పటికే జనవరిలో ₹1,033 కోట్ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం, ఇప్పుడు మరో ₹6,200 కోట్లను విడుదల చేసింది. ఇందులో జీపీఎఫ్ (GPF), ఏపీజీఏఐ (APGLI) పథకాల కింద కూడా పెండింగ్‌లో ఉన్న బకాయిలను మంజూరు చేసింది. సీపీఎస్ ఉద్యోగులు ఎప్పుడూ తమ మ్యాచింగ్ గ్రాంట్‌ను 12 నెలలు ఆలస్యంగా అందుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఫిబ్రవరి వరకు బకాయిలను ఖాతాల్లోకి జమ చేయడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించి మెయిల్స్ రావడంతో, వారు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఒకేసారి ₹2,300 కోట్ల చెల్లింపులు జరిగే అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం- 5 నెలల పెండింగ్ బకాయిలను విడుదల, 9 నెలల మ్యాచింగ్ గ్రాంట్ జమ, మొత్తం ₹2,300 కోట్లు CPS ఉద్యోగుల ఖాతాల్లోకి CPS ఉద్యోగులు కొన్నేళ్లుగా పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై పోరాటం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో, అధికార కూటమి నేతలు CPS విధానాన్ని సమీక్షించి పాత పెన్షన్ పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు దీనిపై స్పష్టమైన ప్రకటన రాలేదు. ఉద్యోగ సంఘాల నేతలు త్వరలోనే DA బకాయిల చెల్లింపులు కూడా జరుగుతాయని ఆశిస్తున్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణపై త్వరలోనే ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని, ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

CPS ఉద్యోగుల కోసం తీసుకున్న తాజా నిర్ణయాలు:

₹2,300 కోట్లు CPS ఫ్రాన్ ఖాతాల్లోకి విడుదల, 9 నెలల పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ చెల్లింపు, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద మొత్తం ₹6,200 కోట్లు విడుదల, DA పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వానికి ఉద్యోగుల విజ్ఞప్తి, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులు కొంత మేర ఊరట పొందారు. బకాయిల చెల్లింపుతో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో, ప్రభుత్వ నిర్ణయం పైన సీపీఎస్ ఉద్యోగులు ఆశతో ఉన్నారు.

Related Posts
మంత్రి కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్‌
surekha hot comments

మంత్రి కొండా సురేఖ మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లోకి నిలిచారు. ఈసారి బీఆర్ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాయకుల వ్యవహారశైలి పట్ల తీవ్ర విమర్శలు చేశారు. Read more

Minister Komatireddy : త్వరలోనే కాళేశ్వరం వాస్తవాలు బయటపెడతాం : మంత్రి కోమటిరెడ్డి
We will soon reveal the facts of Kaleshwaram.. Minister Komatireddy

Minister Komatireddy : ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వేషన్ సెంటర్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ… Read more

అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
earthquake 7 magnitude hits

అమెరికాలో భారీ భూకంపం (Earthquake ) సంభవించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత(7.0 magnitude earthquake)ను నమోదు చేసుకుంది. నార్తర్న్ Read more

చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త
చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త

చార్‌ధామ్ యాత్ర మార్గంలో అన్ని పనులు ఏప్రిల్ 15 నాటికి పూర్తవాలని ప్రజా పనుల శాఖ మంత్రి పాండే ఆదేశించారు ఈసారి యాత్ర మార్గంలో ప్రతి 10 Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×