ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు సామాజిక సేవలను మరింత సమర్ధంగా అందించే దిశగా అడుగులేస్తున్నాయి. వాయిదా పడిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలోనే అమలుకు రానుంది. డిజిటల్ రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు చేయబడింది. ఇది లబ్దిదారుల కోసం మరింత సౌకర్యంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

రేషన్ సరుకులపై కొత్త నిర్ణయం
ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పోషక విలువలతో కూడిన కంది పప్పు మరియు తృణధాన్యాలు అందించనుంది. రేషన్ కార్డుదారులకు ఇచ్చే ఈ సరుకులను జూన్ నెల నుంచి అమలులోకి తీసుకొస్తున్నారు. రేషన్ సరుకులతోపాటు సబ్సిడీపై కిలో కందిపప్పు, రాగులు ఉచితంగా అందించడానికి ఏర్పాట్లు చేసారు. ఈ మేరకు రాష్ట్రంలోని 1.46 కోట్లకు పైగా ఉన్న రేషన్కార్డుదారులకు మూడు నెలలకు సరిపడేలా కందిపుప్పు, ఏడాదికి సరిపడా రాగుల సేకరణ కోసం పౌరసరఫరాల సంస్థ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. రేషన్కార్డుదారులతోపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు సేకరిస్తోంది.
పంచదార సేకరణపై చర్యలు
అలాగే, 43,860 టన్నుల ఐఎస్ఎస్ గ్రేడ్ పంచదార సేకరణ ప్రక్రియను జూన్ నుంచి నవంబరు నెల వరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పంచదార ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపిణీ చేయబడుతుంది. టెండర్ల ప్రక్రియ ముగియడంతో నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు రవాణా చేయనున్నారు. రాగులను క్వింటాళ్ల లెక్కన గోనెసంచుల్లో రవాణా చేయనున్నారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైన కసరత్తు చేస్తోంది. దీనికి ముందుగానే లబ్దిదారులు ఈ కేవైసీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆ తరువాత కొత్త కార్డుల దరఖాస్తుల పరిశీలన కొత్తవి జారీ పైన మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించనుంది.
కేవైసీ ప్రక్రియపై స్పష్టత
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా కేవైసీ (కస్టమర్ వ్యరిఫికేషన్ సిస్టమ్) పూర్తి చేయాలని స్పష్టత ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డులు జారీ చేయబడ్డాయి. కేవైసీ ప్రక్రియ 2025 మార్చి 31 నాటికి పూర్తయ్యేలా చేసేందుకు అన్ని రేషన్ కార్డుదారులు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఈ గడువులో రేషన్ కార్డు లింక్ చేయని వారికి రేషన్ సబ్సిడీ రద్దు అవుతుంది. నకిలీ రేషన్ కార్డులు తొలగించి అర్హత కలిగిన లబ్దిదారులకు మాత్రమే రేషన్ సబ్సిడీ అందించడం ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా సాధ్యం అవుతుంది ఈకేవైసీ పూర్తి చేయడానికి గడువు రేషన్ కార్డు బ్యాంకులు ఈ కేవైసీ ప్రక్రియను 2025 మార్చి 31నాటికి పూర్తి చేయాలని తొలుత భావించినా ఈ నెల (ఏప్రిల్) నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఈకేవైసీ పూర్తి చేయనట్లయితే రేషన్ కార్డునుంచి మీ పేరు తొలగించనున్నారు.
Read also: Andhra Pradesh: చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారన్న కోపంతో.. కన్న తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు