Andhra Pradesh: ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త..జూన్ 1 నుంచి కొత్త రేషన్ సరుకుల పంపిణీ!

Andhra Pradesh: ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త..జూన్ 1 నుంచి కొత్త రేషన్ సరుకుల పంపిణీ!

ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు సామాజిక సేవలను మరింత సమర్ధంగా అందించే దిశగా అడుగులేస్తున్నాయి. వాయిదా పడిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలోనే అమలుకు రానుంది. డిజిటల్ రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు చేయబడింది. ఇది లబ్దిదారుల కోసం మరింత సౌకర్యంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Advertisements

రేషన్ సరుకులపై కొత్త నిర్ణయం

ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పోషక విలువలతో కూడిన కంది పప్పు మరియు తృణధాన్యాలు అందించనుంది. రేషన్ కార్డుదారులకు ఇచ్చే ఈ సరుకులను జూన్ నెల నుంచి అమలులోకి తీసుకొస్తున్నారు. రేషన్ సరుకులతోపాటు సబ్సిడీపై కిలో కందిపప్పు, రాగులు ఉచితంగా అందించడానికి ఏర్పాట్లు చేసారు. ఈ మేరకు రాష్ట్రంలోని 1.46 కోట్లకు పైగా ఉన్న రేషన్‌కార్డుదారులకు మూడు నెలలకు సరిపడేలా కందిపుప్పు, ఏడాదికి సరిపడా రాగుల సేకరణ కోసం పౌరసరఫరాల సంస్థ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. రేషన్‌కార్డుదారులతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్‌ లబ్ధిదారులకు జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు సేకరిస్తోంది.

పంచదార సేకరణపై చర్యలు

అలాగే, 43,860 టన్నుల ఐఎస్ఎస్ గ్రేడ్ పంచదార సేకరణ ప్రక్రియను జూన్ నుంచి నవంబరు నెల వరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పంచదార ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపిణీ చేయబడుతుంది. టెండర్ల ప్రక్రియ ముగియడంతో నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు రవాణా చేయనున్నారు. రాగులను క్వింటాళ్ల లెక్కన గోనెసంచుల్లో రవాణా చేయనున్నారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైన కసరత్తు చేస్తోంది. దీనికి ముందుగానే లబ్దిదారులు ఈ కేవైసీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆ తరువాత కొత్త కార్డుల దరఖాస్తుల పరిశీలన కొత్తవి జారీ పైన మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించనుంది.

కేవైసీ ప్రక్రియపై స్పష్టత

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా కేవైసీ (కస్టమర్ వ్యరిఫికేషన్ సిస్టమ్) పూర్తి చేయాలని స్పష్టత ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డులు జారీ చేయబడ్డాయి. కేవైసీ ప్రక్రియ 2025 మార్చి 31 నాటికి పూర్తయ్యేలా చేసేందుకు అన్ని రేషన్ కార్డుదారులు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఈ గడువులో రేషన్ కార్డు లింక్ చేయని వారికి రేషన్ సబ్సిడీ రద్దు అవుతుంది. నకిలీ రేషన్ కార్డులు తొలగించి అర్హత కలిగిన లబ్దిదారులకు మాత్రమే రేషన్ సబ్సిడీ అందించడం ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా సాధ్యం అవుతుంది ఈకేవైసీ పూర్తి చేయడానికి గడువు రేషన్ కార్డు బ్యాంకులు ఈ కేవైసీ ప్రక్రియను 2025 మార్చి 31నాటికి పూర్తి చేయాలని తొలుత భావించినా ఈ నెల (ఏప్రిల్) నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఈకేవైసీ పూర్తి చేయనట్లయితే రేషన్ కార్డునుంచి మీ పేరు తొలగించనున్నారు.

Read also: Andhra Pradesh: చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారన్న కోపంతో.. కన్న తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు

Related Posts
War : చైనా, పాకిస్థాన్.. మీ బుద్ధులు మారవా?
pakistan, china

సరిహద్దుల్లో ఉన్న పాకిస్థాన్, చైనా (Pakistan & China) దేశాలు గతకొంత కాలంగా భారత్‌ను కవ్వించడమే పనిగా పెట్టుకున్నాయి. పాకిస్థాన్ తరచూ ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ, కశ్మీర్(Kashmir ) Read more

Fire Accident : నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం
Fire breaks out at NIMS emergency department

Fire Accident : హైదరాబాద్​ నిమ్స్(నిజాం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న ఐదో అంతస్థు Read more

మోదీకి కేజ్రీవాల్ లేఖ!
మోదీకి కేజ్రీవాల్ లేఖ!

జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ మోదీకి లేఖ రాసిన అరవింద్ కేజ్రీవాల్. గత దశాబ్దంలో ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీకి కేంద్రం ద్రోహం చేసిందని ఆరోపించిన అరవింద్ Read more

Pawan Son : మార్క్ శంకర్ ను రక్షించిన సిబ్బందికి సన్మానం
empuraanpawan kalyan mark shankar

సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×