Andhrapradesh: ప‌దో త‌ర‌గ‌తిలో స‌త్తాచాటిన విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం

Andhrapradesh: ప‌దో త‌ర‌గ‌తిలో స‌త్తాచాటిన విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం

అనంతపురం జిల్లా ఇటీవ‌ల విడుద‌లైన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో స‌త్తాచాటిన ప్ర‌తిభావంతుల‌కు ఎంఈఓ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో భాగంగా, బెళుగుప్ప మండల విద్యాధికారి (MEO) మల్లారెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, పది తరగతి ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విమాన ప్రయాణం నిర్వహించారు.

Advertisements

మాట నిలబెట్టుకున్న ఎంఈఓ

బెళుగుప్ప మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరం పది తరగతి పరీక్షల్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందులో ముఖ్యంగా ఇందు, లావణ్య, ఈశ్వరి, అర్చన, మధుశ్రీ అనే విద్యార్థినిలు 550కి పైగా మార్కులు సాధించారు. పరీక్షల ముందు, విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఎంఈఓ మల్లారెడ్డి ఒక హామీ ఇచ్చారు — “550కి పైగా మార్కులు సాధిస్తే మీకు విమాన ప్రయాణం చేయిస్తాను.” ఈ హామీ మాటలు నిజం చేసాడు. ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థినుల విజయాన్ని చూసి ఎంఈఓ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ వినోద్ కుమార్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల అనుమతిని తీసుకుని తన మిషన్‌ను ప్రారంభించారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి

గురువారం విద్యార్థినులతో కలిసి మల్లారెడ్డి బెళుగుప్ప నుండి బెంగళూరుకు బయలుదేరి, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణించారు. ఇది ఈ విద్యార్థినులకు జీవితంలో మొదటిసారి విమానం ఎక్కే అవకాశం. అక్క‌డ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను చూపించి తీసుకువ‌స్తాన‌ని, అందుకు అయ్యే వ్య‌యాన్ని తానే భ‌రిస్తాన‌ని ఎంఈఓ తెలిపారు.  

Read also: Chandrababu: అమరావతి ప్రజల చిరకాల కోరిక నెరవేరే రోజు :చంద్రబాబు

Related Posts
స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ
స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతి: 2014 -19 లో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడింది. 2014-19 మధ్య జరిగినన్ని స్కాములు దేశంలో ఎక్కడా జరగలేదు. దేశంలోనే ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో Read more

గద్దర్ కూతురికి కీలక పదవి కట్టబెట్టిన రేవంత్ సర్కార్
vennela

గద్దర్‌ కూతురు డాక్టర్‌ గుమ్మడి వెన్నెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు Read more

అవకాశమిస్తే రాజ్యసభకు వెళతా.. లేకపోతే విశ్రాంతి: యనమల
If I get a chance, I will go to Rajya Sabha.. otherwise, I will rest: Yanamala

అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భవిష్యత్తులో పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే విశ్రాంత Read more

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
Manmohan Singh dies

మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలను భారతదేశంలో తీసుకువచ్చిన మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991 నుంచి 1996 వరకు అప్పటి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×