Andhra Pradesh: ఆలయ అధికారులపై అనంతబాబు దూషణలు

Andhra Pradesh: ఆలయ అధికారులపై అనంతబాబు దూషణలు

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.స్వామివారి కళ్యాణం తర్వాత అక్షింతలు ఆలస్యం కావడంతో రెచ్చిపోయారు. ఏకంగా ఆలయ అధికారులపై దుర్భాషలాడారు. ‘వాడెవడు వాడి పెత్తనం ఏమిటిక్కడ?’ అంటూ కామెంట్స్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా అనంతబాబు ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. అన్నవరం సత్యదేవుని ఆలయంలో గురువారం స్వామివారి కళ్యాణం ముగిసిన అనంతరం అక్షింతలు ఆలస్యమవడంతో అనంతబాబు ఆలయ అధికారులపై ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.తనకు తగిన గౌరవం ఇవ్వలేదంటూ హడావుడి చేశారట. అక్షింతలు ఇవ్వలేదని కళ్యాణ వేదిక వద్దే ఉండిపోయారని సమాచారం. ముఖ్యఅతిథులు వెళ్లిపోయినా అక్కడే ఉండి తనకు అక్షింతలు ఇవ్వాలని పట్టుబట్టారట.పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈవో సుబ్బారావు, ఎమ్మెల్సీ అనంతబాబు చేతులు పట్టుకుని ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొంతసేపు అక్కడ ఈ వ్యవహారంపై చర్చ జరిగిన అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు(Ananth Babu) అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ సమయంలోనే ఆలయ పీఆర్ఓ‌ను ‘వాడెవడు వాడి పెత్తనం ఏంటి ఇక్కడ’ అంటూ దూషణలకు పాల్పడి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతబాబు అనుచరులు సైతం ఓవరాక్షన్, వెధవ వేషాలు అంటూ దూషించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనంతబాబు తీరును భక్తులు తప్పుబడుతున్నారు. 

Advertisements
 Andhra Pradesh: ఆలయ అధికారులపై అనంతబాబు దూషణలు
Andhra Pradesh: అనంతబాబు దూషణలు

ప్రభుత్వం

అనంతబాబు ,సుబ్రహ్మణ్యాన్ని చంపిన (కాకినాడలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. కేసులో ఆరోపణలపై అరెస్టై జైలకు వెళ్లి మధ్యంతర బెయిల్‌పై వచ్చారు. ఇటీవల ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా(Special Advocate)నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత అనంతబాబు ఓ వీడియో వివాదంలో కూడా చిక్కుకున్నారు.తాజాగా అన్నవరం ఆలయంలో జరిగిన ఘటనతో ఎమ్మెల్సీ అనంతబాబు తీరు చర్చనీయాంశమైంది.

Read Also : Andhra Pradesh: ఏపీలో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎక్కడంటే?

Related Posts
ఆంధ్రాలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్
women sewing

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టుపని Read more

Vishaka Stadium: విశాఖ స్టేడియం పేరు మార్పు!
విశాఖ స్టేడియం పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పేర్ల మార్పు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏపీ కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా జిల్లాలు, మున్సిపాలిటీలు, Read more

టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని
Alla Nani

వైసీపీకి దెబ్బమీదదెబ్బ తగులుతున్నాయి. ఈ పార్టీకి రాజీనామాల వరుసలు మొదలయ్యాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 Read more

ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు
ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు

నందమూరి తారకరామారావు (ఎన్.టి.ఆర్) మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్ ఘాట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్ యొక్క 29వ వర్ధంతి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×