అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

సోమవారం విజయవాడ బస్టాండ్ లో ఏసీ బస్సు బీభత్సం సృష్టించి ముగ్గురు ప్రాణాలు తీసుకోగా..నేడు అనంతపురం కలెక్టరేట్ వద్ద మరో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. నిన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్లాట్‌ఫారమ్ మీదకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు.

ఈ ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ కండక్టర్, ఒక మహిళా ప్రయాణికురాలు, మరో చిన్నారి మృతి చెందారు. అటు పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన గురించి మాట్లాడుకుంటుండగానే..అనంతపురంలో రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాష్ట్ర కలెక్టరేట్ వద్దకు రాగానే ర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేక్ వేసే ప్రయత్నం చేసారు డ్రైవర్. కానీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో బస్సు చాలా వేగంగా దూసుకెళ్లింది. దీనివల్ల బస్సులో ఎవ్వరికీ ఏమీ అవ్వలేదు కానీ రోడ్డు మీద వెళుతన్న వాహనాదారుల్లో ఒకరి మృతి చెందారు. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయిన విషయాన్ని గమనించని ఇద్దరు వాహనదారులు యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో బస్సు కిందికి దూరారు. దీంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

ఏం జరుగుతోందో తెలిసే లోపు యాక్సిడెంట్ అయిపోవడం వలన అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ కు ఒక కాలికి ఒక చేతికి పెరాల్సిస్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు హిందూపురం ఆర్టీసీ డిపోకు చెందినది.బస్ నంబర్- ap02z0499.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.