పదో తరగతి చదువుతున్న బాలిక పై వృద్ధుడి అత్యాచారయత్నం

ఏపీలో వరుస హత్యాచారాలు , అత్యాచారయత్నాలు సంచలనం రేపుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక..ఈ దాడులు తగ్గుతాయని అంత అనుకున్నారు కానీ అంత మించి జరుగుతుండడంతో కూటమి సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా పలు ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా పదో తరగతి చదువుతున్న బాలిక పై వృద్ధుడి అత్యాచారయత్నం ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రకాశం జిల్లా అయిన టంగుటూరులో ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న బాలిక పై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరు లేని సమయంలో బాలిక తన ఇంట్లో చదువుతూ ఉండగా చాటుగా వచ్చి అత్యాచారం చేయబోయాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు గమనించి కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.