జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు షాక్ ఇచ్చిన ఆమ్రపాలి

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ కాటా ఆమ్రపాలి పాలనలో తనదైన శైలీలో దూకుడు పెంచారు. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నందున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఆమ్రపాలి… కొందరు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఈ క్రమంలో ఆమె నలుగురు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పారిశుద్ధ్యంపై సీరియస్ గా దృష్టి పెట్టకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధ్యులైన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమ్రపాలి స్పష్టం చేశారు.