image

ఏపీ పర్యటనకు వెళ్లనున్న అమిత్‌షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం (18వ తేదీ) ఏపీ పర్యటనకు వెళ్లనున్నారు. కృష్ణా జిల్లా , గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ , ఎన్ఐడీఎం ప్రాంగణాలను కేంద్ర హోం మంత్రి ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి వస్తారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు. ఇవి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనివి కావడంతో ఆయన ప్రత్యేకంగా వస్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా కూడా ఆసక్తి రేపుతోంది. అమిత్ షా పర్యటన కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా రాజకీయాలను అమిత్ షానే పట్టించుకుంటంటారు. పాలన పరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజీగా ఉంటారు. అయితే అంతిమ నిర్ణయం తీసుకునేది ప్రధాని మోడీనే. పనులన్నీ చక్కబెట్టేది అమిత్ షా. ఏపీ పర్యటనలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ ముగ్గురి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

image
image

కాగా, ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి ఏడు నెలలు గడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్‌సీపీ నిర్వాకాల కారణంగా ఎన్నో బ్యాక్ లాగ్స్ పెండింగ్‌లో ఉన్నాయని .. వాటిని క్లియర్ చేయాల్సి ఉందని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవకలపై నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్నింటిలో కేంద్ర దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్ మెంట్ అవసరమని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్నింటిపై ముగ్గురు నేతల మధ్య చర్చలు జరిగే అవకాశముందని తెలియవచ్చింది.

  • Read more :

Related Posts
అల్లు అర్జున్ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు
అల్లు అర్జున్ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. ఆయన Read more

నేను పవన్ కళ్యాణ్ ను ఏమి అనలేదు – బిఆర్ నాయుడు
BR Naidu tirumala

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను ఏదో అన్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. Read more

2025లో శామ్‌సంగ్ కొత్త విండ్‌ఫ్రీ మోడళ్ల
Samsung new windfree models in 2025

గురుగ్రామ్ : శామ్‌సంగ్, భారతదేశపు అగ్రశ్రేణి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, 2025లో ఒక డజనుకు పైగా ఎయిర్ కండిషనర్ల మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది. దక్షిణ కొరియా Read more

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన మంత్రి తుమ్మల
thmmala brs

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టిన బీఆర్ నాయుడును..తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కలిశారు. హైదరాబాద్‌లోని బీఆర్ నాయుడు నివాసంలో మర్యాదపూర్వంగా కలవడం జరిగింది. శ్రీవారి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *