Ambatiredbook

నారా లోకేష్ రెడ్ బుక్ పై అంబటి కీలక వ్యాఖ్యలు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నాయకత్వం, ముఖ్యంగా నారా లోకేష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనకు సంబంధించిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి, అది ఫలితాలేమీ ఇవ్వలేదని ఆయన అన్నారు. పెట్టుబడులు రాబట్టడంలో పూర్తి విఫలమయ్యారని విమర్శించారు.

గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తనను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. నారా లోకేష్ రెడ్ బుక్ అంటే ఎవరికీ భయం కలిగించలేదని, వైసీపీ శ్రేణులు కేసుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హామీలను అమలు చేయకుండా ఉండే పరిస్థితి వస్తే, ప్రజల తరఫున పోరాటం చేయడంలో వెనకడుగు వేయమని హెచ్చరించారు.

lokesh red book
lokesh red book

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మినహాయించి టీడీపీ నేతలు ప్రకటించిన పథకాలు అమలు కాలేదని అంబటి విమర్శించారు. విజయసాయిరెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా నాయకత్వాన్ని అవమానపరచాలని టీడీపీ ప్రయత్నించిందని తెలిపారు. విజయసాయిరెడ్డి మీద ఒత్తిడి తెచ్చిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రధానమంత్రి మోదీతో పాటు ఇతర ముఖ్యమంత్రులకు కూడా సలహాలు ఇచ్చే స్థాయిలో మాట్లాడటం వెర్రి తత్వమని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహాలు, అభూత కల్పనలకు మాత్రమే టీడీపీ పరిమితమైందని అంబటి విమర్శించారు.

Related Posts
సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్
అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.గురువారం అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ తన నివాసంలో ఈ Read more

ఢిల్లీలో ఏఐసీసీ ప్రారంభోత్సవానికి సీఎం
ఢిల్లీలో ఏఐసీసీ ప్రారంభోత్సవానికి సీఎం

కొత్త ఏఐసీసీ కార్యాలయం, ఇందిరా గాంధీ భవన్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు Read more

మాజీ MLC కన్నుమూత.. నేతల సంతాపం
former mlc satyanarayana

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ జర్నలిస్టు ఆర్‌ సత్యనారాయణ (Satyanarayana) ఆదివారం ఉదయం అనారోగ్యంతో సంగారెడ్డి లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. Read more

కమ్యూనిటీ వెల్‌నెస్‌ను ప్రోత్సహించడానికి ‘ఫ్రీడం పార్క్’ని ప్రారంభించిన జీఈఎఫ్ ఇండియా
GEF India launched Freedom Park to promote community wellness

సమాజం యొక్క విభిన్న అవసరాలను తీర్చగల సమ్మిళిత , పర్యావరణ అనుకూల స్థలాలను ఫ్రీడమ్ పార్క్ సృష్టిస్తుంది Hyderabad: ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల తయారీదారులు, జెమిని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *