Ambati Rambabu : పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి పిఠాపురం మండలం చిత్రాడలో నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అంబటి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఒప్పదలచుకున్నా ఒప్పకపోయినా, ఆయన రాజకీయాల్లో ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలు నడుపుతున్న పవన్, గతంలో తనే కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించాడని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే కుటుంబ రాజకీయాల కూర గుడ్డ వండి తన అన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడని విమర్శించారు. కుటుంబ పాలనను వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తన కుటుంబానికే లబ్ధి చేకూర్చడం ఏంటని ప్రశ్నించారు.గతంలో ఉత్తరాది వారి అహంకారాన్ని తప్పుబట్టిన పవన్ కల్యాణ్, ఇప్పుడు వారిని కాపాడే సైనికుడిలా మారాడని ఆరోపించారు.
ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ, తానేంటో తెలియని స్థితిలో పవన్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.అంబటి తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ను ఉద్దేశించి, “మొదట ఎర్ర కండువా, తర్వాత కాషాయ కండువా ధరించాడు. వ్యూహం మార్చుకోవడమా సిద్ధాంత మార్పా ఎక్కడో ఓ చోట నిలదొక్కుకోవాలి కదా కానీ పవన్ గాలికి కొట్టుకుపోతున్నాడు. తన మాటల్లోనే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని చెప్పిన కాలం మర్చిపోయారా అప్పట్లో ఆయన అడవుల్లోకి వెళ్లిపోతాడేమోనని భయపడ్డామండీ!” అంటూ వ్యాఖ్యానించారు.అంతేకాక బాలినేని శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకుని రాజకీయాలు చేయాలని చూస్తే, పవన్ కల్యాణ్ గోవిందా గోవింద అంటూ ముగింపు పలికారు.