Allu Arjun to Nampally court once again

మరోసారి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నేడు మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నేటితో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. అదే రోజు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

Advertisements

ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. ఆయన లాయర్లు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలపనున్నారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టి, అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరనున్నారు.

ఇదివరకే బాధితురాలు రేవతి కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ రూ. 1కోటి రూపాయల చెక్ అందించగా, పుష్ప 2 దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు సాయం చేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును అందజేశారు.

Related Posts
మాతృభాషను అందరూ మార్చిపోతున్నాం: కిషన్ రెడ్డి
Everyone is changing their mother tongue.. Kishan Reddy

న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత Read more

తీన్మార్ మల్లన్నపై డీజీపీకి రెడ్డి సంఘాల ఫిర్యాదు
teenmar mallanna

తెలంగాణలో తీన్మార్ మల్లన్నపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న వరంగల్‌లో జరిగిన బీసీ బహిరంగ సభలో రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు Read more

విరాట్ కోహ్లి ఖాతాలో మరో సరికొత్త రికార్డు
virat kohli record

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్‌ భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును Read more

సొంతపార్టీ నేతలే డీకే శివకుమార్‌పై విమర్శలు
DKSHIVA

డీకే శివకుమార్‌ కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌పై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు ఆధ్వర్యంలో జరిగిన Read more

×