పశ్చిమ బెంగాల్లోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అత్యాచారం మరియు హత్యకు గురైన 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు శుక్రవారం మాట్లాడుతూ, కోల్కతా పోలీసులు, ఆసుపత్రి పరిపాలన మరియు టిఎంసికి చెందిన ప్రజాప్రతినిధులు, ఈ భయంకరమైన సంఘటనను నిగ్గుతేల్చడానికి చురుకైన పాత్ర పోషిస్తున్నారు అని, తద్వారా నిజం వెలుగులోకి రాకుండా చేస్తున్నారు అని మరణించిన వైద్యురాలి తల్లి పేర్కొంది. నేరం వెనుక ఉన్న ప్రధాన కుట్రదారులను రక్షించడానికి సంబంధిత అధికారులు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. నేరస్తుల పాత్రను వెలికితీయడంలో సిబిఐ విఫలమైందని మరియు ఈ కేసులో పెద్ద కుట్ర జరుగుతుంది అని ఆమె ఆరోపించారు.

నేరం జరిగిన స్థలాన్ని ఎందుకు సీల్ చేయలేకపోయారో మమతా బెనర్జీ వివరణ ఇవ్వాలి, మరియు సంఘటన జరిగిన తర్వాత చాలా మంది ప్రవేశించారు. ఆలా ప్రవేశించడం ద్వారా సాక్ష్యాలు తారుమారు అయ్యాయి. ఆగస్ట్ 9 ఉదయం 68 మంది వ్యక్తులు ఈ ప్రాంతంలో తిరుగుతున్న దృశ్యాలు ఉన్నా, అందరిలో ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే నేరానికి పాల్పడినట్లు ఎలా గుర్తించారో ఆమె వివరించాలి అని అన్నారు. ఈ వాస్తవాలను సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని బాధితురాలి తల్లి ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యురాలికి రక్షణ కల్పించడంలో రాష్ట్రం విఫలమైందని మరియు నేరం యొక్క అంశాన్ని దాచడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. తమ వాంగ్మూలాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలో నమోదు చేసినప్పటికీ తమ ఆందోళనలను పరిష్కరించలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. కోల్కతా పోలీసులు కొంతమందిని రక్షించడానికి సరిగ్గా దర్యాప్తు చేయలేదు అని కూడా ఆయన ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధికార ప్రతినిధి, కునాల్ ఘోష్, తల్లిదండ్రుల ఆరోపణలను “దురదృష్టకరం” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పేలవంగా చిత్రీకరించి సీఎం పరువు తీయాలని కొందరు వారిని ప్రేరేపించాయని ఆరోపించారు. సిఎం ఆదేశాల మేరకు కోల్కతా పోలీసులు సంఘటన జరిగిన వెంటనే దర్యాప్తును వేగవంతం చేసి సంజయ్ రాయ్ను అరెస్టు చేసారు, విచారణను ముగించేందుకు కోల్కతా పోలీసులకు వారం రోజుల గడువు ఇచ్చింది. కానీ, కలకత్తా హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐకి అప్పగించారు అని ఘోష్ చెప్పారు.