రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

Rahul gandhi: రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు గడువు నిర్దేశించింది. నాలుగు వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని సూచించింది. అయితే కేంద్రం- న్యాయస్థానానికి 8 వారాల గడువు కోరగా, నాలుగు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను లఖ్‌నవూ బెంచ్‌ ఏప్రిల్‌ 21కి వాయిదా వేసింది. ఆ లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ను కేంద్రం కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
కొన్నేళ్లుగా పౌరసత్వంపై రగడ
రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యర్త విఘ్నేశ్‌ శిశిర్ వేసిన పిటిషన్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.

Advertisements
రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

బ్రిటిష్‌ పౌరుడిగా రాహుల్​ గాంధీ
బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్‌ గాంధీ డైరెక్టర్
, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంత కాలంగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్‌ పౌరుడిగా రాహుల్​ గాంధీ పేర్కొన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి భారత దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 9, భారతీయ పౌరసత్వ చట్టం, 1955ని ఉల్లంఘించడమే అవుతుందని స్వామి పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు. మరోవైపు తన వద్ద రాహుల్‌గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నాయని విఘ్నేశ్‌ చెబుతున్నారు.

Related Posts
Blocked In India: భారత్​లో గ్లోబల్ టైమ్స్​, జిన్హువా ఎక్స్​ ఖాతాలు బ్లాక్
భారత్​లో గ్లోబల్ టైమ్స్​, జిన్హువా ఎక్స్​ ఖాతాలు బ్లాక్

చైనా అధికారిక మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్ (Global Times), జిన్హువా ఎక్స్‌(X) ఖాతాలను కేంద్ర ప్రభుత్వం (Central Government) భారత్‌(India) లో బ్లాక్ చేసింది. ఆపరేషన్ Read more

Union Minister: పీఓకే భారత్‌లో విలీనం కావాల్సిందే:రాందాస్ అథవాలే
Union Minister: పీఓకే భారత్‌లో విలీనం కావాల్సిందే:రాందాస్ అథవాలే

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధినేత,కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే ఎన్నటికైనా Read more

మణిపుర్ కు వెళ్లండి మోదీజీ.. రాహుల్ వినతి
modi rahul

మణిపుర్లో పర్యటించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని PM మోదీని రాహుల్ గాంధీ మరోసారి కోరారు. మణిపుర్లో మళ్లీ హింస చెలరేగడంపై ఆయన ఆందోళన Read more

సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీని దోషిగా తేల్చిన కోర్టు
1984 anti Sikh riots murder

ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన ఘోర ఘటన 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ రౌస్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×