shiridi

షిరిడి వెళ్లే భక్తులకు అలర్ట్!

ప్రసాదాలయ నిర్వహణలో కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. దర్శనం తర్వాత ఉచిత భోజన టోకెన్లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. టోకెన్ల ద్వారానే ప్రసాదం సదుపాయం అమలు చేస్తోంది. కొన్ని ఘటనలతో ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. ఇక నుంచి టోకెన్ లేని వారిని ప్రసాదాల ఆలయంలోకి అనుమతించమని సంస్థాన్ సీఈవో వెల్లడించారు.షిర్డీ సాయి సంస్థాన్ కొత్త నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా ప్రసాదాల ఆలయంలోకి ఎంట్రీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రసాదాలయంలోకి మద్యపానం, ధూమపానం, నేర ప్రవృత్తి ఉన్నవారిని అరికట్టేందుకు టోకెన్ వ్యవస్థను అమలు ప్రారంభించింది. షిర్డీలో నిత్యం దాదాపు 50 వేల మంది భక్తులు ఉచిత ప్రసాదం స్వీకరిస్తారు. ఈ ప్రసాదాలయం సాయి బాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే, కొద్ది రోజులుగా ప్రసాదం స్వీకరణ కోసం వస్తున్న కొందరితో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, ట్రస్టు బోర్డు అక్కడకు వస్తున్న వారి పైన నిఘా పెట్టింది. కాగా, భక్తులు కాకుండా ఇతరులు వస్తున్నారని గుర్తించారు.

img 20180324 wa0077 largejpg (1)

దీంతో, అటు వంటి వారికి ప్రవేశం లేకుండా టోకెన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. సాయిబాబా దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులకు సాయి ప్రసాదాలయంలో ఉచిత భోజన టోకెన్​తో పాటు విభూది, బూందీ ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఒకవేళ దర్శనానికి ముందే భోజనం చేయాలనుకునే భక్తులకు ప్రసాదాల ఆలయంలో ఉచితంగా టోకెన్లు అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే రెండు ఆస్పత్రుల రోగులు, వారి కుటుంబీకులకు వసతి ఏర్పాట్లు చేస్తామని వివరించారు.కొద్ది రోజుల క్రితం షిర్డీ సాయి సంస్థాన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హత్యకు గురయ్యారు.సంస్థాన్ అధికారులు అప్రమత్తం అయ్యారు.

Related Posts
విజయసాయిరెడ్డికి నోటీసులు..!
Notices to Vijayasai Reddy.

అమరావతీ: వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌ , కాకినాడ సెజ్​లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. కేఎస్‌పీఎల్‌ Read more

జమిలి జేపీసీలో ప్రియాంకాగాంధీ?
priyanka

‘వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ Read more

మావోలకు మరో దెబ్బ.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంట‌ర్
encounter in chhattisgarh

ఇటీవల కాలంలో మావోలకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో వరుసపెట్టి మావోలు కన్నుమూస్తున్నారు. తాజాగా ఈరోజు శనివారం బస్తర్ రీజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ Read more

మరోసారి మోడీ పై విశ్వాసం రుజువైంది: పవన్‌ కల్యాణ్‌
Faith in Prime Minister Modi has been proved once again.. Pawan Kalyan

అమరావతి: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Read more