Pahalgam Attack: పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై స్పందించిన అజిత్‌

Pahalgam Attack: పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై స్పందించిన అజిత్‌

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులు, అందులోనూ పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ తాజాగా స్పందించారు. పర్యాటకులపై జరిగిన ఆ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisements

మరోసారి

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అజిత్‌ పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. అనంతరం అజిత్‌ మాట్లాడుతూ పెహల్‌గామ్‌ ఉగ్రదాడిని ఖండించారు. ప్రజలంతా ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. కుల, మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలన్నారు.పెహల్‌గామ్‌ వంటి దారుణమైన ఘటనలు దేశంలో మరోసారి జరగకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు. పద్మ అవార్డుల కార్యక్రమంలో సాయుధ దళాలను కలిసినట్లు చెప్పారు. వారి త్యాగాలను మెచ్చుకున్నారు. వారందరి కారణంగానే మనం ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నాం అంటూ అజిత్‌ చెప్పుకొచ్చారు.

  Pahalgam Attack: పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై స్పందించిన అజిత్‌

పారిపోయి

జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు.సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.13 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో పౌరులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. మరోవైపు, పాకిస్థాన్ సైతం సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడితో భారత్‌ తమపై 2019 పుల్వామా ఆత్మాహుతి ఘటన తర్వాత దాడిచేసినట్టు మరోసారి మెరుపు దాడులకు దిగుతుందేమోనని దాయాది భావిస్తోంది.

Read Also: Movie : ‘ఎస్ఎస్ఎంబి 29’ మూవీ లీక్స్ స్పందించిన రాజమౌళి

Related Posts
Hari Hara Veera Mallu: త్వరలోప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న హరిహ‌ర వీర‌మ‌ల్లు
త్వరలోప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న హరిహ‌ర వీర‌మ‌ల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ పై కీలక అప్‌డేట్ చిత్రబృందం Read more

Rajinikanth : ‘కూలీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Rajinikanth ‘కూలీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నారు. ఈసారి అతని తోడుగా ఉండబోతున్నాడు మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న Read more

Niharika: మానస శర్మతో నిహారిక రెండో సినిమా
Niharika: మానస శర్మతో నిహారిక రెండో సినిమా

మెగా డాటర్ నిహారిక కొణిదెల రెండో సినిమా సిద్ధం! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో మరో భారీ ప్రాజెక్ట్ మెగా డాటర్ నిహారిక కొణిదెల తన నిర్మాణ సంస్థ Read more

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కడైనా కియారా కనిపిస్తుందా ?
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కడైనా కియారా కనిపిస్తుందా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా గేమ్ ఛేంజర్ ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠతో వేచి వేళ.ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×