తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేసిన ఏఐజీ ఆస్పత్రి

వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కోరడం తో దాతలు ముందుకు వస్తున్నారు. చిత్రసీమ తో పాటు పలు రంగాల వారు తమకు తోచిన సాయాన్ని అందజేస్తున్నారు.

తెలంగాణ వరద బాధితులకు ఏఐజీ ఆస్పత్రి రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ పీవీఎస్ రాజులు సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమై చెక్కును అందించారు. వారి దాతృత్వాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు.