అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి (మం) కొప్పుగుండుపాలెంలో సురేష్‌ మృతదేహం లభ్యమైంది. అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో మైనర్‌ బాలిక హత్య ఇటీవల ఏపీలో సంచలనం సృష్టించింది. తనను జైలుకు పంపించారని పగ పెంచుకుని ఇంట్లోకి చొరబడి బాలిక గొంతు కోసిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాలికను చంపి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ చెబితే 50 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

కాగా, మైనర్‌ బాలికను హత్య చేసిన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మొదట్నుంచి పోలీసులు అనుమానించారు. హత్య జరిగిన స్థలంలో నిందితుడు రాసిన లేఖ ఆధారంగా పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. చివరకు ఊహించినట్టుగానే నిందితుడు సురేశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్‌ ఇంటికి దగ్గరలోని పొలాల్లో మృతదేహం లభ్యమైంది. నిందితుడి కోసం 4 రోజులుగా పోలీసులు గాలించారు. నైన్త్‌ క్లాస్ స్టూడెంట్‌ చంపిన సురేష్‌.. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై బ్లాక్‌ కలర్‌ టీషర్ట్‌, ట్రాక్‌ ప్యాంట్‌ ఉన్నాయి. బాలిక హత్య సమయంలో అదే డ్రెస్‌తో సురేష్‌ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.