liquor sales in telangana jpg

ఏపీలో నేటి నుంచి నూతన మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

Wines bandh for three days in AP
Wines bandh

రాష్ట్రంలో మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్ తీసుకవచ్చింది. దసరా పండుగకు ముందే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడిందని ఆరోపించిన మంత్రి.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు వైస్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ఖరారు చేసింది.

ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది. మొత్తం 3,396 మద్యం షాపుల లైసెన్స్ ల జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మంగళవారం (అక్టోబర్ 1,ఈరోజు) నుంచే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మద్యం షాపులు నిర్వహించాలనుకునే వారు అన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ధరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. అయితే ఒక్కో దరఖాస్తునకు రూ.2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 11న జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుండి లైసెన్సుదారులు కొత్త షాపులను ప్రారంభించి అమ్మకాలు చేపడతారని తెలిపారు.

Related Posts
నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం..
Today is International Mens Day

న్యూఢిల్లీ: నేడు అనగా 19 నవంబర్ 2024, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటున్నారు. సమాజంలో పురుషుల సహకారాన్ని ప్రశంసించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబం, Read more

టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ విజేతగా ప్రజ్ఞానంద
Praggnanandhaa winner

ప్రఖ్యాత టాటా స్టీల్ చెస్ మాస్టర్స్-2025 ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద విజేతగా నిలిచారు. నెదర్లాండ్స్‌లోని Wijk aan Zeeలో జరిగిన ఉత్కంఠభరిత టైబ్రేక్ మ్యాచ్‌లో Read more

పర్యావరణ కార్యకర్త తులసి గౌడ ఇక లేరు..
tulsi gowda

తులసి గౌడ, 86 సంవత్సరాల వయస్సు గల ప్రముఖ భారతీయ పర్యావరణ వేత్త, డిసెంబర్ 16, 2024న కర్ణాటక రాష్ట్రం, దావణగెరే జిల్లాలో మరణించారు. ఆమె ఆరోగ్య Read more

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ..!
gangula kamalakar letter to

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ రాసారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. Read more