ACB officials who did not allow KTR's lawyers

కేటీఆర్‌ లాయర్లను అనుమతించని ఏసీబీ..

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసిబి వద్ద కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ వెంట లాయర్లను వెళ్లడానికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన వెంట లాయర్లు ఎందుకు రాకుడదు అని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. దాదాపు అరగంటపాటు అక్కడ ఎదురుచూసిన కేటీఆర్.. చివరికి ఏసీబీ ఆఫీసులోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు.

విచారణకు అడ్వకేట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీకి కేటీఆర్ న్యాయవాది నోట్ ఇచ్చారు. నోట్ తీసుకున్న ఏసీబీ అధికారులు లాయర్లను వెంట పంపించేందుకు అనుమతించలేదు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోవచ్చునని.. లాయర్లను లోపలికి అనుమతించకపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అటు నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

అంతకుముందు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన కేటీఆర్..అక్కడ లీగల్ టీమ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేసుకు సంబంధించి ఏసీబీ చేస్తున్న ఆరోపణలు..వాటికి చెప్పాల్సిన సమాధానాలపై వివరాలను తీసుకున్నారు కేటీఆర్. ఆ తర్వాత బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను కేటీఆర్ కలిశారు. నాయకులతో భేటీ తర్వాత ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు కేటీఆర్. 2022 జులై లో హైదరాబాద్ లో జరిగిన ఈ రేస్ లో ప్రభుత్వ నిధులను కేటీఆఱ్ విదేశీ సంస్థలకు అనుమతులు లేకుండా మళ్లించారంటూ ఆయనపై ఆరోపణలు రాగా..ప్రభుత్వం ఈ కేసులో ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇక ఇదే కేసులో రేపు ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.

Related Posts
దావోస్‌లో చంద్రబాబు డ్రీమ్
దావోస్‌లో చంద్రబాబు డ్రీమ్

30 సంవత్సరాల క్రితం ఓ సమయం గుర్తు చేసుకోండి. ఓ యువ, మహత్వాకాంక్షి నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు, తన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద కలలు కంటున్నారు. Read more

కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
Power struggle in Karnataka Congress

డీకే శివకుమార్‌ ‘పవర్‌’ను తగ్గించే ముమ్మర ప్రయత్నాలు బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సీఎం పదవిని డీకే శివకుమార్‌కు అందకుండా చేయడానికి సీఎం Read more

కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్
Theenmar Mallanna suspended from Congress party

హైదరాబాద్‌: కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ Read more

వరల్డ్ స్ట్రోక్ డే 2024: స్ట్రోక్ సంఘటనలు పెరుగుతున్నందున పునరావాస మరియు పునరుద్ధరణ కేంద్రాల యొక్క అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్
World Stroke Day 2024. HCAH reveals urgent need for rehabilitation and recovery centers as stroke incidence rises

హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ డే 2024 న, తెలంగాణలో స్ట్రోక్ కేసుల ప్రాబల్యం పై ప్రధానంగా దృష్టి సారించింది , ఇది రక్తపోటు, మధుమేహం, ధూమపానం మరియు Read more