మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు

మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇబ్రహిం పట్నంలో ఆయన నివాసంలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబం అగ్రి గోల్డ్‌ భూములను చెరబట్టింది. సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి అప్పనంగా రూ.5కోట్ల పైచిలుకు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.