Academy Awards: 2026 ఆస్కార్ అవార్డులకు నూతన నిబంధనలు

Academy Awards: 2026 ఆస్కార్ అవార్డులకు నూతన నిబంధనలు

చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) తాజాగా ముఖ్యమైన ప్రకటనలు చేసింది. 98వ ఆస్కార్ వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగనుంది.

Advertisements

2026 ఆస్కార్ అవార్డుల్లో ఒక కొత్త విభాగం చేర్చబడింది – అచీవ్ మెంట్ ఇన్ కాస్టింగ్ ఇప్పటివరకు ప్రత్యేకంగా కాస్టింగ్ డైరెక్టర్ల పనిని గుర్తించని అకాడమీ, ఈసారి వారి ప్రతిభను గుర్తించి ఓ ప్రత్యేక అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విభాగానికి రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ప్రాథమిక ఓటింగ్ ద్వారా షార్ట్ లిస్ట్, ఫైనల్ ఓటింగ్ ద్వారా విజేత ఎంపిక అలాగే, కాస్టింగ్ డైరెక్టర్లు తమ పని సరైనదిగా సమర్థించుకునేలా ముందుగా కొన్ని రౌండ్ల ద్వారా టెస్ట్‌లకు హాజరుకావాల్సి ఉంటుంది.

కృత్రిమ మేధ (AI) మరియు ఆస్కార్

ఇప్పటి వరకూ ఆస్కార్ అవార్డుల్లో ఏఐ ఆధారిత చిత్రాలపై స్పష్టత లేదు. కానీ 2026కు సంబంధించి అకాడమీ ఒక స్పష్టమైన ధృవీకరణ ఇచ్చింది. కృత్రిమ మేధ (AI) ఉపయోగించి రూపొందించిన చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇది ఇతర మూవీలపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ఏఐ మూవీల కంటే సాధారణ మూవీలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అకాడమీ వెల్లడించింది. ఈ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్ నగరంలో ఉన్న డాల్బీ థియేటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. జనవరి 2025 నుంచి డిసెంబర్ వరకు విడుదలైన మూవీలు ఆస్కార్ అవార్డులకు పోటీ పడనున్నాయి. అయితే మ్యూజిక్ విభాగంలో మాత్రం తుది గడువు ఈ ఏడాది అక్టోబర్ 15గా నిర్ణయించడం జరిగిందని తెలిపింది.

Read also: Mahesh Babu: మ‌హేశ్ బాబుకు ఈడీ నోటీసులు

Related Posts
Pahalgam Terror Attack : వినయ్ నర్వాల్ కుటుంబానికి భారీగా పరిహారం
Pahalgam Terror Attack Vina

ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దుఃఖంలో ముంచింది. ఈ దాడిలో భారత నావికాదళానికి చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ వీరమరణం Read more

Tahawwur Rana : నేడు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి!
Today, India is the mastermind behind the Mumbai attacks!

Tahawwur Rana: అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహావుర్ హుస్సేన్ రాణాను నేడు భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. ఈ Read more

అమరావతిలో జరిగింది భూ స్కాం : బొత్స సత్యనారాయణ
అమరావతిలో జరిగింది భూ స్కాం : బొత్స సత్యనారాయణ

అమరావతి: మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పాం అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు. మేము Read more

Sindhu Water : భారత్ నీళ్లు ఆపేస్తుందా: పాకిస్థాన్ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
Sindhu Water భారత్ నీళ్లు ఆపేస్తుందా పాకిస్థాన్ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని మరింత గట్టిగా చూపిస్తోంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవన్నీ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×