AAP leader Kailash Gahlot joined BJP

బీజేపీలో చేరిన ఆప్‌ నేత కైలాశ్‌ గెహ్లాట్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు కైలాష్ గెహ్లాట్‌ బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్‌ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌ కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి హామీలు ఇస్తోందని.. పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కైలాశ్‌ గహ్లోత్‌ ఆ లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో ఏర్పడిన ఆప్‌ ఆశయాలను ఆ పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయని మండిపడ్డారు.

ఢిల్లీ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ రాజీనామాపై ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ స్పందిస్తూ.. బీజేపీ దిగజారుడు రాజకీయాలతో కుట్రలను విజయవంతంగా అమలుచేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడి వల్లే తాజా పరిణామం చోటుచేసుకుందని.. గహ్లోత్‌ను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు టార్గెట్‌ చేశాయని ఆరోపించారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న గహ్లోత్‌ ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. బీజేపీ ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే ఆయన ఇప్పుడు ఆరోపిస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కైలాశ్ స్పందించారు.

ఇది నాకు సులభమైన నిర్ణయం కాదు. అన్నా హజారే ఆధ్వర్యంలో 2011-12 సమయంలో దేశంలో పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేను ఆప్‌లో ఉన్నాను. ఎమ్మెల్యే, మంత్రిగా ఢిల్లీకి నావంతు సేవలు అందించాను. ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయమని కొందరు భావిస్తున్నారు. ఒత్తిడి వల్లే ఈ అడుగు వేశానని అంటున్నారు. ఒత్తిడి వల్ల ఎప్పుడూ నేను ఏ నిర్ణయం తీసుకోలేదని వారికి స్పష్టం చేస్తున్నాను అని వెల్లడించారు.

Related Posts
హైదరాబాద్‌ లో స్థిరపడిన ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్:చంద్రబాబు
హైదరాబాద్‌ లో స్థిరపడిన ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం తెలంగాణలో ఉన్న డీఎంఈ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ Read more

KTR : చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను కలిసిన కేటీఆర్
KTR meets former Governor Narasimhan in Chennai

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు. చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ Read more

మధ్యాహ్న భోజనం కాదు బేకరీ ఫుడ్ వల్లే అస్వస్థత – మాగనూర్ ఘటన పై కలెక్టర్ క్లారిటీ
food poison in maganoor

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ హాస్టల్స్ లలో , గురుకుల ఆశ్రమంలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో Read more

తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
Assembly sessions to resume

హైదరాబాద్‌: ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని Read more