rape college student

ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి నమ్మించేందుకు ప్రయత్నించాడు. అదును చూసుకుని యువతిని అత్యాచారం చేసి, నగ్నంగా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

కంచికచర్లలోని ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి, సమీప గ్రామం పరిటాలలో తోటి విద్యార్థినులతో కలిసి ఉండేది. అదే గ్రామానికి చెందిన గాలి సైదా అనే యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. కొద్దిరోజులకే స్నేహం మరింత దగ్గరయ్యింది. దీన్ని ఆసరాగా తీసుకున్న సైదా మాయ మాటలతో యువతిని శారీరకంగా దోపిడీ చేశాడు. దీనితో ఆగకుండా, ఆమెను నగ్నంగా చిత్రీకరించి, వాటిని తన వద్ద భద్రపరిచాడు. ఆ ఫొటోలతో యువతిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతనితో పాటు అతని మిత్రులు కూడా ఈ ఫొటోలు చూసి యువతిని బెదిరించడం ప్రారంభించారు.

ఈ వేధింపులు తట్టుకోలేక యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహం పేరుతో అమ్మాయిలను మోసం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ద్వారా యువతులు అప్రమత్తంగా ఉండాలని, అజ్ఞాత వ్యక్తుల మాటలను నమ్మి తమ జీవితాన్ని ముప్పు పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related Posts
వైసీపీకి బిగ్ షాక్!
వైసీపీకి బిగ్ షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు పార్టీని Read more

అంబేద్కర్‌అభయ హస్తం ఎక్కడ..? కాంగ్రెస్ కు కేటీఆర్ సూటి ప్రశ్న
KTR direct question to Cong

తెలంగాణలో ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ హరిస్తున్నట్లు పేర్కొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండేట్ కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ Read more

Amaravati: రూ.11 వేల కోట్లతో ఏపీ రాజధానికి కొత్త కళ..!
amaravati

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు, కేంద్రం నుండి ఆర్థిక Read more

నేను అందరికీ నచ్చాలని లేదు – సీఎం రేవంత్
నిర్దేశిత స‌మ‌యంలో నిర్మాణాలు పూర్తి చేయాలి: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాను అందరికీ నచ్చాలనుకోవడం లేదని, కొందరికి తన విధానాలు నచ్చవచ్చని, మరికొందరికి నచ్చకపోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని Read more