కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

రోడ్డు ప్రమాదాలు అనేవి ఆగడం లేదు..జాగ్రత్తలు పాటించమని , అతివేగం ప్రమాదకరం అని చెపుతున్నప్పటికీ కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యానికి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి శివారులోని 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 28 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. లారీ సెడెన్ బ్రేక్ వేయడంతో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన కు సంబదించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.