అనకాపల్లి : ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పరవాడ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల గురించి కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే 2024 నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో భారీ అగ్ని ప్రమాదాలే జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ నెల రోజులు కూడా గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.