మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉప్పొంగుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన నటన, ఎనర్జీ, డ్యాన్స్, సామాజిక సేవలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఆయన నటిస్తున్న “విశ్వంభర” సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో భారీగా VFX షాట్స్ ఉండబోతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. చిరంజీవి ఇంతకుముందు లేని విధంగా కొత్త కాన్సెప్ట్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారని సమాచారం.అలాగే మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఓ చిత్రం చేస్తున్నారు. అనిల్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం, అనే సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్తో సినిమా చేసి తన విజయాల జాబితాలో మరో బ్లాక్బస్టర్ని నమోదు చేసుకోవాలని భావిస్తున్నాడు.
సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని
ఈ కాంబినేషన్పై అభిమానుల్లో అపారమైన అంచనాలు ఉన్నాయి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తోపాటు చిరంజీవి స్టైల్కు తగ్గ మాస్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రాబోతోందని టాక్.రేపు ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజుతో చిరంజీవి 70వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. మెగాస్టార్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.ఇదిలా ఉంటే మెగాస్టార్ (Megastar Chiranjeevi) గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో చిరు మాట్లాడుతూ.. తన పై విషప్రయోగం జరిగిందని తెలిపారు. ఒక అభిమాని తనపై విషప్రయోగం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ‘మరణమృదంగం అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని చేసిన పని నా ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ అభిమాని కేక్ తెచ్చి బలవంతంగా నా నోట్లో పెట్టాడు. అయితే నాకు కేక్ లాంటి వాటిని స్పూన్తో తినడం అలవాటు.

వశీకరణం పౌడర్ తీసుకొచ్చి కేక్లో కలిపినట్లు తెలిసింది
అయితే అతను నా నోట్లో పెట్టిన కేక్ చేదుగా అనిపించడంతో బయట పడేశా. అయితే అ సమయంలో అతను చేత్తో నాకు కేక్ తినిపించాడు. అంతేకాకుండా చేదుగా కూడా అనిపించింది. దీంతో వెంటనే బయట పడేశా. వెంటనే సెట్లో ఉన్నవారితో ఈ విషయం చెప్పాను. అతన్ని పట్టుకుని కొడితే అసలు నిజం బయటపెట్టాడు.అభిమాని తెచ్చిన కేక్ శాంపిల్స్ను టెస్టింగ్కు పంపించారు. టెస్ట్ చేసిన తర్వాత ఆ కేక్ లో విషం కలిసినట్లు తేలింది. కేరళ నుంచి ఏదో వశీకరణం పౌడర్ తీసుకొచ్చి కేక్లో కలిపినట్లు తెలిసింది. ఇది విని అందరూ షాక్కు గురయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటంటే కేక్ తినిపించినది నాకు పిచ్చి అభిమాని. అయితే అతనిని పట్టించుకోలేదనే కోపంతో నాపై వశీకరణ ప్రయోగం చేశాడు. ఈ విషయం తెలుసుకుని నేను వెంటనే అతన్ని క్షమించి వదిలేశా’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చిరంజీవి “మెగాస్టార్” బిరుదు ఎప్పుడు సంపాదించారు?
1980లలో వరుస హిట్లు ఇవ్వడంతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా నిలిచిన తర్వాత అభిమానులు ఆయనకు “మెగాస్టార్” అనే బిరుదు ఇచ్చారు.
చిరంజీవి రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు?
2008లో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: