हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vande Bharat Train: వందేభారత్ ట్రైన్ నర్సాపూర్ వరకు పొడగింపు!

Sharanya
Vande Bharat Train: వందేభారత్ ట్రైన్ నర్సాపూర్ వరకు పొడగింపు!

ఆంధ్రప్రదేశ్ రైల్వే వ్యవస్థలో ఇటీవల కాలంలో వందే భారత్ రైళ్ల ప్రవేశం ఒక భారీ మలుపు తీసుకొచ్చింది. అధునాతన సాంకేతికత, వేగం, సౌకర్యాల పరంగా దేశంలో వేగంగా ఆమోదం పొందిన ఈ రైళ్లు ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుండటం ఆనందకరం. తాజాగా, వందే భారత్ రైలు చెన్నై-విజయవాడ మార్గాన్ని నర్సాపురం వరకు పొడిగించాలనే ప్రతిపాదన అధికారికంగా ముందుకొచ్చింది. ఇది పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు పండుగ లాంటి శుభవార్తగా మారింది.

విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ మార్గానికి ఇప్పటికే విస్తరణ

ఇంతకుముందు దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్‌కు సామర్లకోట, ఏలూరు స్టేషన్లలో హాల్టింగ్ అందించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ చేశారు. ఈ చర్యలతో ఆ ప్రాంతాల ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందుతున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు నర్సాపురం వరకు వందే భారత్ పొడిగింపు కోసం ముమ్మరంగా ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి.

విజయవాడలో నిలిచే సమయం – ముఖ్యమైన సమస్య

ప్రస్తుతం చెన్నై నుండి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ రైలు విజయవాడలో ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. దీని వల్ల మిగిలిన రైళ్లకు ప్లాట్‌ఫారమ్ అందకపోవడం, షెడ్యూల్ గందరగోళం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తే, ప్రయోజనకరమని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ వందే భారత్ రైలును మొదటి భీమవరం వరకు పొడిగించాలని భావించిన ఆ ఆలోచనను విరమించుకుంది. భీమవరంలో ఈ రైలును ఆపితే బోగిలలో నీళ్లు నింపడానికి అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని విరమించుకొని, మచిలీపట్నం వరకైనా పొడిగించాలని ఆలోచించింది.

నర్సాపురం వైపు పొడిగింపు వెనుక రాజకీయ ప్రోత్సాహం

కేంద్ర మంత్రి చొరవతో అక్కడివరకు వందేభారత్ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ, కేంద్రమంత్రి కావడంతో ఆయన నరసాపురం వరకు వందే భారత్ ను పొడిగిస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏలూరు మీదుగా వందే భారత్ నడుస్తుందని, నరసాపురం వైపు కూడా వందే భారత్ నడిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడంతో ఈ మార్గ విస్తరణకు బలమైన ఆధారం ఏర్పడింది.

నర్సాపురం స్టేషన్లో శరవేగంగా పనులు

వందే భారత్ రైలు నర్సాపురం వరకు వచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటులో భాగంగా, రైళ్లో నీటి నింపే పైప్లైన్, ట్రాక్ మెరుగుదల, స్టేషన్ పునరుద్ధరణ వంటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. విజయవాడలో నిలిపే బదులుగా రైలును నర్సాపురం వరకు పొడిగిస్తే, రైల్వే నెట్‌వర్క్‌కు వ్యాపకత పెరుగుతుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రయాణికులు నేరుగా చెన్నై వెళ్లే అవకాశం పొందుతారు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు, పర్యాటకుల కోసం కూడా ప్రయోజనకరం. పైగా, ఇతర రైళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

Read also: Andhrapradesh: ఈ నెలలోనే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం అమలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870