55 Crore People Bath in Kum

కుంభమేళాలో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు: ప్రభుత్వం ప్రకటన

మానవ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమమన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం

ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతున్నారు. మంగళవారం సాయంత్రానికి దాదాపు 55 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు.ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది. భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తెలిపింది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఊహించని రీతిలో భక్తులు తరలివస్తున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కుంభమేళాలో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు

ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర, సాంస్కృతిక-సామాజిక కార్యక్రమం. ఇప్పటికే 55 కోట్ల మందికిపైగా మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా 55 కోట్ల మార్కును చేరుకుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది,మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు” అని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

పౌరాణిక గాథలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు

మహాకుంభమేళాలో శాంతిభద్రతలకు అవాంతరం కలగకుండా యూపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏఐతో కూడిన అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఏఐతో అనుసంధానమైన డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, సమాచార కేంద్రాల ద్వారా భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించేలా ఏర్పాటు చేసిన పౌరాణిక గాథలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Related Posts
Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read more

కాంతార చిత్ర బృందానికి ఊరట
కాంతార చిత్ర బృందానికి ఊరట,

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రిషబ్ శెట్టి సినిమా ‘కాంతార: చాప్టర్ 1’ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంది. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలోని Read more

బస్సులో మహిళపై అత్యాచారం: నిందితుడి సమాచారం ఇస్తే రూ.1 లక్ష రివార్డు
MSRTC బస్సులో మహిళపై అత్యాచారం: నిందితుడి సమాచారం ఇస్తే రూ.1 లక్ష రివార్డు

మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందనను రేపింది. MSRTC బస్సులో ఒక యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు దత్తాత్రే రాందాస్ గాడే Read more

చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు
చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు

తల్లిఒడిలో అల్లారుముద్దుగా పెరగాల్సిన ముక్కుపచ్చలారని పసికందులను.. అక్రమ రవాణాకు అలవాటు పడ్డ రాబందులు రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్నాయి. చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో ఇతర రాష్ట్రాల Read more