Headlines
revanth reddy

గ్రామ పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది రేవంత్ సర్కార్. ఇకపై ఈ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో భాగంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, వారికి ప్రతి నెలా రూ. 116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది. వారందరికీ ప్రతి నెలా గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని, వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని
కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Discover vasari country club homes for sale bonita springs florida. Were. Basic implements by domestic helper | 健樂護理有限公司 kl home care ltd.