Headlines
modi lokesh

లోకేశ్.. నీ మీద ఫిర్యాదు ఉంది – ప్రధాని మోడీ

విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌తో సరదాగా సంభాషించిన సందర్భం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదిక వద్ద మోదీని ఆహ్వానించేందుకు నిలుచున్న లోకేశ్‌ను ప్రధాని మోదీ చమత్కారంగా ఉద్దేశించి మాట్లాడారు. ఈ మాటలు అక్కడి అందరినీ ఆకట్టుకున్నాయి.

“లోకేశ్.. నీ మీద ఒక ఫిర్యాదు ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయింది. కానీ ఇప్పటివరకు నన్ను ఢిల్లీకి వచ్చి ఎందుకు కలవలేదు?” అంటూ ప్రధాని మోదీ సరదాగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యతో వేదికపై వున్న వాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు. మోదీ తీరును చూసి లోకేశ్ కూడా ఆనందంగా స్పందించారు.

ప్రధాని మోదీ తనను ఢిల్లీకి వచ్చి కుటుంబంతో కలిసి కలవాలని లోకేశ్‌ను ఆహ్వానించారు. దీనికి వెంటనే స్పందించిన లోకేశ్, “మేము త్వరలో ఢిల్లీకి వచ్చి తప్పకుండా కలుస్తాం” అంటూ సమాధానమిచ్చారు. ఈ మాటలతో మోదీ తనదైన సరదా శైలిని మరోసారి ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధుల మధ్య ఇలా చమత్కారభరితమైన సంభాషణ జరిగితే ఆత్మీయత పెరుగుతుందని, సంబంధాలు మరింత బలపడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించడం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం వంటి కార్యక్రమాలతో పాటు, ఈ విధమైన సరదా దృశ్యాలు ప్రజల మనసులను అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8655 naples heritage drive 312. Were. Advantages of overseas domestic helper.