హైదరాబాద్ : స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి మరియు అసాధారణమైన కస్టమర్ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా, దాని ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్ను AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham)-థింక్ గ్యాస్ విడుదల చేసింది. ఈ కార్డును మల్టీ-సిటీ లైవ్ ఈవెంట్లో సీనియర్ నాయకత్వం సమక్షంలో AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham)-థింక్ గ్యాస్, చైర్మన్ శ్రీ అమితవ సేన్గుప్తా విడుదల చేశారు.
అత్యుత్తమ శ్రేణి భదత్రా ఫీచర్లతో సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన కస్టమర్ అనుభవాన్ని ఈ వినూత్న కార్డ్తో, కస్టమర్లు ఆస్వాదించవచ్చు. ఈ కార్డ్ ఇంధన, సురక్షితమైన & సౌకర్యవంతమైన నగదు రహిత చెల్లింపుల కోసం రీడీమ్ చేయదగిన క్యాష్బ్యాక్ను అందిస్తుంది, ఒకే మాస్టర్ ఖాతాను ఉపయోగించి తమ మొత్తం ఫ్లీట్ను పర్యవేక్షించడానికి నిర్వాహకులకు వీలు కల్పిస్తుంది.
కార్డు ఆవిష్కరణ సందర్భంగా AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham)- థింక్ గ్యాస్ చైర్మన్ శ్రీ అమితవ సేన్గుప్తా మాట్లాడుతూ.. “మైలేజ్+ ఫ్యూయల్ కార్డ్ అనేది మా స్టేషన్లలో కస్టమర్ అనుభవాన్ని పునర్నిర్వచించే విప్లవాత్మక ఆవిషరణ. ఈ ఆవిష్కరణ స్వచ్ఛమైన , మరింత స్థిరమైన మరియు వినియోగదారు కేంద్రీకృత ఇంధన పర్యావరణ వ్యవస్థను రూపొందించే దిశగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కార్డ్ మా పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది” అని అన్నారు.
జాగెల్ యొక్క ఎండి & సీఈఓ , శ్రీ అవినాష్ గోడ్ఖిండి మాట్లాడుతూ..” AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham) తో ఈ సహకారం రవాణా రంగంలో అర్ధవంతమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. గ్రామీణ భారతదేశంలోని ఫ్లీట్ యజమానులు మరియు ట్రక్ ఆపరేటర్ల మార్కెట్కు సేవ చేయడమే లక్ష్యంగా ఉంది..” అని అన్నారు.
AG&P ప్రథమ్ సంస్థ ( AG&P Pratham) మరియు థింక్ గ్యాస్ యొక్క MD మరియు CEO శ్రీ అభిలేష్ గుప్తా మాట్లాడుతూ, “మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్ అనేది మా కస్టమర్లు మరియు వారి రీఫ్యూయలింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ప్రత్యేకమైన కార్డ్. ఈ కార్డ్ AG&P ప్రథమ్-థింక్ గ్యాస్ స్టేషన్లలో కరెన్సీగా మారుతుంది మరియు మా కస్టమర్లు వారి లావాదేవీలను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది…” అని అన్నారు. AG&P ప్రథమ్-థింక్ గ్యాస్ తన స్టేషన్లలో మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్ని ఉపయోగించి చేసిన CNG కొనుగోళ్లపై రూ. 3/kg వరకు గణనీయమైన పొదుపును అందిస్తోంది.