Headlines
70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం..

70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం..

పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీలో 70 ఏళ్లుగా మూతపడిన సిద్ధీశ్వర మహాదేవ ఆలయం తాజాగా తలుపులు తెరచుకున్నాయి. ఈ కార్యక్రమం స్థానిక ముస్లింల సహకారంతో బుధవారం జరగింది. మకర సంక్రాంతి తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించి, సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టాలని అధికారులు ప్రకటించారు. అన్నపూర్ణ దేవాలయ ఆధ్వర్యంలో పూజలకు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం..
70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం..

వారణాసి జిల్లా మదన్‌పురాలో ఉన్న సిద్ధీశ్వర మహాదేవ ఆలయాన్ని బుధవారం మధ్యాహ్నం 1 గంటకు వారణాసి ఏడీఎం సిటీ అలోక్ వర్మ తెరిచారు. ఆలయం తెరవబడిన సమయంలో భారీ పోలీసు బలగాల సమక్షంలో శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక ముస్లింలు శాంతి భద్రతలను కాపాడడంలో సహకరించారు. ఆలయంలో రెండు లేదా మూడు విరిగిన శివలింగాలు కనిపించాయి, అయితే సిద్ధీశ్వర మహాదేవుని ప్రధాన శివలింగం ఆ స్థలంలో లేదు.సనాతన సంప్రదాయ ప్రకారం, శివలింగం కనిపించకపోయినా, కొత్త శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

ఆలయానికి తెరుచుకున్నప్పుడు, గర్భగుడి వద్ద శిథిలాలు తొలగించి, గంగాజలంతో శుద్ధి చేశారు.అనంతరం ఆలయానికి తిరిగి తాళం వేసి, ‘ధుంధే కాశీ’ ప్రజలు అక్కడ చేరుకుని ‘హర్ హర్ మహాదేవ్‘ అంటూ భక్తిపూర్వకంగా స్మరించుకున్నారు.ఈ ఆలయ పునరుద్ధరణ క్రమంలో, శ్రీ కాశీ విద్వత్ పరిషత్ ద్వారా పూజలు నిర్వహించనున్నారని చెప్పారు. సిద్ధీశ్వర మహాదేవ శివలింగం లేకపోవడంతో, శిలా శివలింగ రూపంలో కొత్త శివలింగం ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. మకర సంక్రాంతి తరువాత, ఆలయాన్ని పునరుద్ధరించి, పవిత్ర కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీ కాశీ విద్వత్ పరిషత్, అన్నపూర్ణ దేవాలయం సహాయంతో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు.ఈ ఆలయ పునరుద్ధరణ కాషి ఆధ్యాత్మిక వారసత్వం నిలుపుకోడానికి ఒక ముఖ్యమైన చర్యగా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

In a briefing on thursday, an israeli military spokesman, lt. Advantages of overseas domestic helper. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.