హైదరాబాద్: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో విచారణకు హాజరయ్యే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు స్వీకరించింది. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 9న విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 6 విచారణకు న్యాయవాదిని అనుమతించని కారణంగా తన ఏసీబీ ఇచ్చిన నోటీసుకు ఆయన సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ఈ నెల 9న విచారణకు హాజరయ్యే సమయంలో కూడా అడ్వకేట్ కు ఏసీబీ అనుమతించలేదు. దీంతో ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
కాగా, ఫార్ములా ఈ-కార్ రేస్పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్రెడ్డికి దమ్ముంటే.. ఆయ న జూబ్లీహిల్స్ ప్యాలెస్లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా, ఈడీ విచారణకైనా సిద్ధమేని స్పష్టంచేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, తనపై మోపిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోనే కొట్లాడుతామని తేల్చిచెప్పారు.
ఈ కేసులు ఆరంభం మాత్రమేనని, నాలుగేండ్లలో ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదురొంటామని, దేశానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉన్నదని పేర్కొన్నారు. ‘నిజాయితీకి ధైర్యం ఎకువ.. రోషంగల్ల తెలంగాణ బిడ్డగా ఏ విచారణనైనా ఎదురొనేందుకు సిద్ధం’ అని చెప్పారు. లాయర్లతో విచారణకు బుధవారం హైకోర్టు అనుమతిస్తే 9న ఏసీబీ విచారణకు లాయర్లతో వెళ్తానని తెలిపారు. 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని, వారు ఏమడిగినా సమాధానం చెప్తానని, దాపరికం లేదు.. దాయాల్సిందేమీ లేదని వెల్లడించారు.