ఏడాది చివరి రోజున ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం అమలుకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 40ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు.
పేద విద్యార్ధులకు మేలు
దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్ధులకు ఈ పథకం వర్తించనుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు కారణంగా ఉన్నత విద్యకు ఈ విద్యార్ధులు దూరం కాకుండా చూడడంలో భాగంగా మథ్యహ్న భోజన పథకాన్ని సర్కార్ అమలులోకి తీసుకొచ్చింది. మధ్యహ్న భోజన పథకం ద్వారా విద్యార్ధికి పౌష్టికాహరం అందడంతో పాటు ఆరోగ్యం, అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందని సర్కార్ భావించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం అమలుకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్ధులకు ఈ పథకం వర్తించనుంది.