Headlines
sankranthi holidays school

సంక్రాంతి సెలవులను తగ్గించిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై షాక్ ఇచ్చింది. మార్చిలో పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, సాధారణంగా ఇచ్చే సెలవుల్ని కేవలం మూడు రోజులకు పరిమితం చేసింది. జనవరి 13, 14, 15 తేదీల్లో మాత్రమే విద్యార్థులకు సెలవులు ఉంటాయని, మిగిలిన రోజుల్లో అదనపు తరగతులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నట్లు ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించనుండటంతో విద్యార్థులు మంచి ప్రదర్శనకు అవకాశముంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు సమయం దక్కుతుంది.

సంక్రాంతి పండుగ దృష్ట్యా సెలవులు తగ్గించడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణంగా సంక్రాంతి సందర్భంగా 10 రోజులకు పైగా సెలవులు ఉండేవి. ఇప్పుడు కేవలం మూడు రోజులు మాత్రమే ఇవ్వడం పట్ల విద్యార్థులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం అంటున్నప్పటికీ, సెలవులు తగ్గించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. మార్చి 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇక్కడ కూడా రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ విధానం విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడంలో దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *